అందోల్, ఆక్టోబర్ 22: రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ వెంటే తామంతా ఉంటామని మండలంలోని అక్సాన్పల్లి గ్రామానికి చెందిన యువకులు ఆదివారం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పాత..కొత్త అనే తారతమ్యం లేకుండా పార్టీ శ్రేణులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమిక్కులు చేసినా వారికి డిపాజిట్లు కూడా రావన్నారు. గతంలో కంటే రెట్టింపు మెజార్టీని అందించి రికార్డులను తిరగరాయాలని పిలుపునిచ్చారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా జోగిపేటలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత అలయ్.. బలయ్ కార్యక్రమం కోసం జోగిపేట ఎన్టీఆర్ స్టేడియంలో స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య ఉన్నారు. అలయ్.. బలయ్ కార్యక్రమానికి నియోజవర్గంలోని 9 మండలాల నుంచి పెద్ద ఎత్తున్న ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ఇతర వీఐపీలు రానున్నారు. ఈ మేరకు స్థలాన్ని పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే ఆదేశించారు. జోగిపేటకు చెందిన హన్మంత్ రావుపేట్ శంకర్గౌడ్ ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెంద గా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట స్టేట్ మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, కౌన్సిలర్లు చందర్ నాయక్, నాగరాజు, అక్సాన్పల్లి సర్పంచులు నరేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ హరినారాయణవర్మ, మాజీ ఎంపీటీసీ శివశేఖర్, సునీల్కుమార్, వెంకటేశం, లక్ష్మణ్, సాయికుమార్, అర్ఫత్ తదితరులు పాల్గొన్నారు.