తొగుట : యువతలో ఉన్న అపార శక్తి, ప్రతిభ సరైన దిశలో వెలుగొందాలంటే క్రీడాస్ఫూర్తి అత్యంత కీలకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ( MLA Kotha Prabhakar Reddy) అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్లో నిర్వహించిన కేపీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ( KPR Criket Tourney) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జీవితాన్ని గెలిపించే మహత్తర పాఠశాలలని తెలిపారు.
గెలుపు ఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తి ఉన్నవారే నిజమైన విజేతలని పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ధైర్యం, ఐక్యత, పట్టుదల వంటి విలువలు పెంపొందుతాయని , ఇవే భవిష్యత్ నాయకత్వానికి పునాది అవుతాయని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా యువతలోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలు బలమైన ఆధారమని అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, పంజాల శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ రాజిరెడ్డి, నర్సింలు, మాజీ ఎంపీటీసీలు వేల్పుల స్వామి కొమ్ము శరత్, నాయకులు దోమల కొమురయ్య, మంగ నర్సింలు, సుతారి రమేష్, బోధనం కనకయ్య, బండారు స్వామి గౌడ్, అరుణ్ కుమార్, తగరం అశోక్, లక్ష్మారెడ్డి, ప్రశాంత్, నర్సింహారెడ్డి, సత్యం, యాదగిరి, లక్ష్మణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
అంతకుముందు జప్తిలింగారెడ్డిపల్లిలో జరుగుతున్న మహంకాళి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ్ రెడ్డి వేర్వేరుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.