కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం కర్షకులు, కార్మికులు సమ్మెకు దిగారు. కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో ‘సమ్మె-గ్రామీణ భారత్ బంద్’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులపై ధర్నా నిర్వహించారు.
కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకోమని హెచ్చరించారు. వ్యాపార సంస్థలను మూసివేయించారు. నిరసన ర్యాలీలు చేపట్టారు. కార్మిక చట్టాలను పునరుద్దరించాలని, కాట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ బంద్కు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.