సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 24: నా రాయణఖేడ్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప నులు ప్రారంభించాలని సంగారెడ్డి కలెక్ట ర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారుల ను ఆదేశించారు.
మంగళవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, నూతనంగా చేపట్టిన 7చెరువుల నిర్మాణ పనుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా యంత్రాంగంతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ త్వరితగతిన పనులు ప్రారంభించాలని అధికారులను కోరారు. ప్రాజెక్టు పనులతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన చెరువుల పనులను ప్రారంభించాలని సూచించారు.