మెదక్ అర్బన్/ రామాయంపేట/ చిలిపిచెడ్, మార్చి10 : మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించా రు. ఈ సందరంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడు తూ.. మహిళలు చట్టలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్ న్యాయమూర్తులు జితేందర్, రీటాలాల్చంద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.బాలయ్య, సెక్రటరీ ఆకుల శ్రీనివాస్, న్యాయవాదులు పోచయ్య, సుభాష్గౌడ్, రామ్శర్మ, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు
ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, కౌన్సిలర్లు, మహిళా సిబ్బందిని సన్మానించారు. మహిళా సంఘాలకు రూ.14.70లక్షల వడ్డీలేని రుణాల చెక్కు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు పావలావడ్డీపై రుణాలు ఇస్తుందన్నారు. ప్రతి ఇంటికి మహిళే ప్రధాన భూమిక అని, మహిళలు ఉం టేనే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయని చైర్మన్ జితేందర్గౌడ్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, మోప్మా ఆర్పీ సునీత, ఆర్పీలు లావణ్య, విజయశ్రీ, కౌన్సిలర్లు రాధాభవాని, జయ, యాదగిరి, నాగరాజు, సుందర్సింగ్, గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, మున్సిపల్ సి బ్బంది సాయిరాంరెడ్డి, ప్రసాద్, నరేశ్, శ్రీనివాస్ ఉన్నారు.
ఝాన్సీలింగాపూర్లో మహిళలకు సన్మానం
రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పంబాల జ్యోతి, ఎంపీటీసీ మద్దూరి జ్యోతి, వార్డు సభ్యులను ఎంపీడీవో ఉమాదేవి, రైతుబంధు సమితి మండ లాధ్యక్షుడు నర్సారెడ్డి తదితరులు సన్మానించారు.
మహిళ లేని ఇల్లు దీపం లేని కోవెల..
చిలిపిచెడ్ ప్రాథమిక పాఠశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులను చండూర్ గ్రామానికి చెందిన చౌటకూరి గోవర్ధన్రెడ్డి బ్రదర్స్ సన్మానించారు. పీఆర్టీయూ మండలాధ్యక్షుడు రఘువేందర్ మాట్లాడుతూ స్త్రీలను గౌరవించే చోట శాంతి సౌభాగ్యాలు విలసిల్ల్లుతాయన్నారు. మహిళ లేని ఇల్లు దీపం లేని కోవెల అని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి అన్నారు. కార్యక్రమంలో చౌటకూరి చంద్రశేఖర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండ లాధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, ఎంపీడీవో శశిప్రభ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సబ్బని శ్రీనివాస్, కేజీవీబీ రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూపరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.