నర్సాపూర్, నవంబర్ 27 : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అనేక రకాలుగా చేయూతనిస్తున్నది. ఆర్థికం గా నిలదొక్కుకునేందుకు ప్రోత్సహిస్తున్నది. మహిళా సం ఘాలను బలోపేతం చేసేందుకు గ్రామైక్య సంఘాలకు ధాన్యం కొనుగోళ్ల నిర్వహణను అప్పగించింది. నర్సాపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. గతేడాది వానకాలం, యా సంగి సీజన్లలో కొనుగోళ్లకు సంబంధించి కమీషన్ డబ్బులు జమచేసింది. ధాన్యం సేకరణ చేస్తూ ఆర్థికంగా ముందుకుసాగుతున్న గ్రామైఖ్య సంఘాలపై ప్రత్యేక కథనం.
నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్,కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్, వెల్దుర్తి, మాసాయిపేట, శివ్వంపేట మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో 38 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. మహిళా గ్రామైక్య సంఘాలకు కొనుగోలు కేంద్రాల బాధ్యతను అప్పగించింది. కాగా మహిళలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత పరిశీలించి, కొనుగోలు చేసి, కేటాయించిన రైస్మిల్లులకు తరలిస్తారు. 2021లో వానకాలం, యాసంగిలో 12లక్షల 19వేల క్విం టాళ్ల ధాన్యాన్ని సేకరించారు.
మహిళా సంఘాలకు రెండు సీజనల్లో ఇచ్చిన కమీషన్ పోనూ రూ.3.90 కోట్లు రావాల్సి ఉన్నది. మహిళా సంఘాలకు క్వింటాల్ ధాన్యం సేకరణకు రూ.32 కమీషన్ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రస్తుత సీజన్లో 4.27లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించి, 3.55 లక్షల క్విం టాళ్లను రైస్మిల్లులకు తరలించారు. డీఆర్డీవో భీమయ్య, డీపీఎం మోహన్, ఏపీఎం అధికారులు కేంద్రాలను పర్యవేక్షిస్తూ మహిళలకు సూచనలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే కొనుగోలు
మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే ధా న్యం కొనుగోలు కేంద్రాల బాధ్యత లను గ్రామైక్య సంఘాలకు అప్పగిం చింది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యానికి కమీషన్ డబ్బులను ప్రభుత్వం గ్రామైక్య సంఘాల ఖాతాల్లో జమచేస్తున్నది.
– ఎర్ర లక్ష్మి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు
రైతులకు అందుబాటులో కేంద్రాలు
రైతులు ధాన్యాన్ని సకాలంలో విక్రయించడానికి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. మహి ళా సంఘాలను బలోపేతం చేసేందు కు ప్రభుత్వం ధాన్యం సేకరణ బాధ్యతలను వారికి అప్పగించింది. వారు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కమీషన్ డబ్బులను గ్రామైక్య సం ఘా ల ఖాతాల్లో జమ చేస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లుకు తరలించే ప్రక్రియ జోరుగా సాగుతున్నది.
– భీమయ్య, డీఆర్డీవో, మెదక్ జిల్లా