పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డి అన్నారు. చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామంలో బుధవారం దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించార న్నారు. రైతుబంధు, రైతు బీమాతో రైతులకు మేలు చేశారన్నారు. ఎమ్మెల్యే రఘునందన్రావు నియోజకవర్గంలో పైసా పనిచేయకుండా ఝూటామాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
మనోహరాబాద్, నవంబర్ 14 : ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అనేక పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు లబ్ధి చేకూర్చిన ఘనత ఆయనకే దక్కుతుందని జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పన్యాల భూపతిరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్, కాళ్లకల్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మొద్దని, కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ను మూడో సారి హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకోవాలని కోరా రు. కళాకారుల ఆటపాటలతో, బీఆర్ఎస్ ప్రచార రథం కదలగా వృద్ధులు, గ్రామస్తులు, నాయకులు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, ఎంపీపీ పురం నవనీతా రవి ముదిరాజ్, సీఎం కేసీఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్కుల మహిపాల్రెడ్డి, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి,ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, నాయకులు నాగిరెడ్డి, ర్యాకల కృష్ణాగౌడ్, భిక్షపతి, నరేందర్గౌడ్, లక్ష్మణ్ యాదవ్, సాయిరాంగౌడ్, మహిపాల్, జా వీద్పాషా తదితరులు పాల్గొన్నారు.
భారీ మెజార్టీతో సీఎం కేసీఆర్ గెలవాలని పూజలు మనోహరాబాద్, నవంబర్ 14 : సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది, మూడో సారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి రామాయిపల్లిలోని నెల్లూరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఉప సర్పంచ్ వెంకటేశ్ ముదిరాజ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రతన్లాల్, నాయకులు మల్లేశ్, కృష్ణ, స్వామి, సాయి, ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.