నర్సాపూర్, ఫిబ్రవరి 9: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి ప్రతి నెలా రూ.10 వేల వేతనం చెల్లించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో వారు మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్వాగతిస్తున్నామని, అయితే, బస్సులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొంద రు ఆటోడ్రైవర్లు కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఆటోడ్రైవర్లకు మద్దతుగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యేలు హరీశ్రావు, సునీతాలక్ష్మారెడ్డి ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటించి బడ్జెట్లో ప్రవేశపెట్టాలని ప్లకార్డును ప్రదర్శించారు.