పేదల జీవితాల్లో బీఆర్ఎస్ పార్టీ వెలుగులు నింపిందని, సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కొల్చారం మండలంలోని దుంపలకుంట చౌరస్తా, ఎనగండ్ల, ఏటిగడ్డ మాందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్, రంగంపేట, చిన్నఘన్పూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకా లు అందించామన్నారు. రాష్ట్రంలో లబ్ధిపొందని కుటుంబం లేదంటే అతిశయోక్తి లేదన్నారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని కోరారు.
కొల్చారం, నవంబర్ 22: పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కొల్చారం మండలంలోని దుంపలకుంట చౌరస్తా, ఎనగండ్ల, ఏటిగడ్డ మాందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్, రంగంపేట, చిన్నఘన్పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుంపలకుంట చౌరస్తా వద్ద ఉన్న జగదాంబ సేవాలాల్ మహరాజ్ దేవాలయంలో గిరిజనులతో కలిసి పూజలు చేశారు. మహిళలతో చేతిలో చేయి కలుపుతూ దుంపలకుంట చౌరస్తా నుంచి ఎనగండ్ల గ్రామంలో వీధులన్నీ తిరిగి, కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఏటిగడ్డ మాందాపూర్లో కురుమ సంఘం సభ్యులు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. కోనాపూర్ గ్రామంలో మహిళలు పూలు చల్లుతూ మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. రంగంపేట – తుక్కాపూర్లోని మదనానంద ఆశ్రమంలో మాధవానంద సరస్వతీ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి మాట్లాడుతూ గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే రైతులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించి పట్టాలు అందజేస్తామన్నారు. మహిళలకు ప్రతి నెలా సౌభాగ్యలక్ష్మి పథకం కింద సరుకులు కొనేందుకు రూ.3వేలు ఇస్తామన్నారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆసరా పింఛన్ రూ.5వేలు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామన్నారు. రైతు బంధు రూ.16 వేలు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ సన్న బియ్యం అందించడంతోపాటు రైతు బీమా తరహాలో రూ.5 లక్షల బీమా వర్తింపజేయనున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కార్మిక సంఘం చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగాయిపల్లి గోపి, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, మండల బిఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, సర్పంచులు గోదావరి, వీరారెడ్డి, కన్నారం రమేశ్, వెల్మకన్నె సంతోష, మాధవి శ్రీశైలం, ఇందిరాప్రియదర్శిని, ఎంపీటీసీ ఆరట్ల ఎల్లయ్య, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎనగండ్ల, కోనాపూర్ ఉప సర్పంచ్లు సుమలత బాబు, సుకన్య మధుసూదన్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేశ్కుమార్, మాజీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ సర్పంచ్లు వెంకటేశం, విజయ్, ఇందిరా పాపయ్య, భానుప్రకాశ్రెడ్డి, మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వేమారెడ్డి, రవితేజరెడ్డి, ఆంజనేయులు, బాగారెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలారి దుర్గేశ్, సంగాయిపేట వెంకట్రెడ్డి, సంజీవరెడ్డి, నవాజ్రెడ్డి, పిల్లెల రాజాగౌడ్, ముత్యం ప్రవీణ్కుమార్, కృష్ణగౌడ్, ప్రభాకర్, మల్లాగౌడ్, నాగరాజ్, విఠల్రెడ్డి, జంగిటి పోచయ్య, మోత్కు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.