మెదక్ అర్బన్, మే 28 : జూన్ మొదటి వారంలోగా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో రైస్మిల్లుల ప్రతినిధులు, ట్రాన్స్ఫోర్ట్ ఏ జెన్సీ, ఐకేపీ, మార్కెటింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలన్నారు. మే నెలాఖరునాటికి చిన్నచిన్న కేంద్రాల్లో వచ్చిన ధాన్యాన్ని పూర్తి గా కొనుగోలు చేసి మూసివేస్తూ మిగతా కేంద్రాలపై దృష్టిసారించాలని సూచించారు. లారీల కొరత లేకుండా అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచాలని ట్రాన్స్ఫోర్ట్ ఏజెన్సీలకు సూచించారు. రైస్ మిల్లర్లు హమాలీలను ఎక్కువగా పెట్టుకొని మిల్లుకు వచ్చిన లారీలను వెంటనే ఖాళీ చేసి పంపాలని,
48 గంటల్లోగా ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. రుతుపవనాలు త్వరగా ప్రవేశిస్తున్నందున ధాన్యం కొనుగోళ్ల ను వేగవంతం చేయాలని, సామర్థ్యానికి మించి వచ్చిన ధా న్యాన్ని సంగారెడ్డి, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు పంపాలని కేం ద్రం నిర్వాహకులకు సూచించారు. ఇప్పటివరకు 42,267 మంది రైతుల నుంచి రూ.344కోట్ల విలువైన 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించామన్నారు. ట్యాబ్ ఎంట్రీ 80 శాతం మాత్రమే అయ్యిందని, వంద శాతం పూర్తయ్యేలా చూడాలని, అప్పుడే రైతులకు నగదు చెల్లింపు జరుగుతుందన్నారు. ప్రతి గింజనూ కొనుగో లు చేస్తామని, తడిసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొంటా మన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, మబ్బులు కమ్మి తే వెంటనే ధాన్యం పై టార్పాలిన్లు కప్పాలని సూచించారు. సమావేశంలో డీఎస్వో శ్రీనివాస్, పౌర సరఫరాశాఖ జిల్లా మేనేజర్ సాయిరాం, రైస్మిల్లుల ప్రతినిధులు పాల్గొన్నారు.