నర్సాపూర్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని జడ్పీ సీఈవో వెంకట శైలేశ్ సూచించారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని ఎల్లాపూర్, అచ్చంపేట్, మంతూర్ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను పరిశీలించి మాట్లాడారు.
పనుల్లో వేగం పెంచాలి
బృహత్ పల్లె ప్రకృతివనం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో అధికారులకు సూచించారు. మండలంలోని పెద్దచింతకుంట గ్రామంలో నిర్మిస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో మార్టిన్ లూథర్, ఎంపీవో సందీప్, ఏపీవో అంజిరెడ్డి, సర్పంచ్ శివకుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.