గజ్వేల్, జూన్ 15: కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి ఆగిందని, ప్రతి కుటుంబానికి నష్టం జరిగిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని మక్తమాసాన్పల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ల కార్యకర్తలు పలువురు సోమవారం ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో వంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి యువకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని, రాబోయే రోజుల్లో కేసీఆర్ సారథ్యంలో మళ్లీ తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆశాభాం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
యూరియా యాప్ తొలిగించాలని, రైతులకు ఎరువులు, విత్తనాలు అందించడంలో సర్కారు విఫలమైందన్నారు. పంటల కొనుగోలులో ప్రభుత్వం విఫలంతో కావడంతో రైతులు ఇబ్బందులు పడినట్లు వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మల్లేశం, గ్రామ సర్పంచ్ ఫహీమ్, మండల ప్రధాన కార్యదర్శి పాల రమేశ్గౌడ్, అహ్మద్, ఉప సర్పంచ్ రాకల వెంకటేశ్, మాజీ సర్పంచ్ శాతం రజిత వెంకటేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు శాతం శ్రీకాంత్, పార్టీలో చేరిన వారిలో రాజు, శాతం గణేశ్, మహేశ్, వేణు, రవీందర్, వెంకటేశ్, ప్రశాంత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.