రామాయంపేట, అక్టోబర్ 20 : రెండు కార్లు ఢీ కొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రామాయంపేట మండలం కోనాపూర్ మూలమలుపు వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్కు చెందిన ఓ కుటుంబం కారులో సిద్దిపేట వైపుకు వెళ్తున్నారు.
సిద్దిపేట నుంచి మరో కారు వేగంగా వచ్చి మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జు కాగా మెదక్ పట్టణానికి చెందిన రసూల్బీ, నజియా బేగం, ముబీన్లకు తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే 108లో రామాయంపేట ప్రభుత్వ దవాఖానకుతరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు.పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.