తూప్రాన్, నవంబర్ 24 : తూప్రాన్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం షీటీంపై అవగాహన సదస్సు నిర్వహించా రు. షీటీం అధికారి శ్రీనివాస్ షీటీం పనితీరును వివరించారు. విద్యార్థులకు చదువుతోపాటు, క్ర మశిక్షణ ముఖ్యమన్నారు. అమ్మాయిలతో గౌరవ మర్యాదలతో మెలగాలన్నారు. అమ్మాయిలతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించడం, సెల్ఫోన్ లో చిత్రీకరించడం నేరమని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 18 ఏండ్లు నిండిన త ర్వాతనే వాహనాలను నడపాలని, లేకుంటే మైనర్లతోపాటు తల్లిదండ్రును శిక్షిస్తామని తెలిపారు. సిగరెట్, గుట్కా, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అన్నిరంగా ల్లో రాణిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్గారెడ్డి, శ్రీనివాసరావు, వేణుగోపాల్, ఝాన్సిరాణి, సురేష్, చంద్రారెడ్డి, లత, ప్రభాకర్ పాల్గొన్నారు.
ఫైజాబాద్ పాఠశాలను సందర్శించినక్యారియర్, నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు
చిలిపిచెడ్, నవంబర్ 24 : మండలంలోని ఫై జాబాద్ ఉన్నత పాఠశాలను క్యారియర్ టెక్నాలజీస్, నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు సందర్శిచారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, పెయింటింగ్ మెటీరియల్ అందజేశారు. పాఠశాల గ్రంథాలయానికి ఆంగ్ల, తెలుగు కథల పుస్తకాలు, డిక్షనరీలు, వ్యాకరణ పుస్తకాలను అం దజేశారు. విద్యార్థులు ఉన్నత చదువు చదివి పా ఠశాలకు మంచిపేరు తేవాలని నిర్మాణ్ సంస్థ కో ఆర్డినేటర్ సతీశ్ సూచించారు. కార్యక్రమంలో క్యారియర్ నిర్మాణ్ బృందం నవీన్రెడ్డి, సుభాష్ గోపవరం, రాకేశ్, శరత్, కుమార్, సతీశ్, ఉపాధ్యాయులు తారాసింగ్, పద్మజ, సంతోశ్, రాధిక, కరుణ, స్నేహలత, విద్యార్థులు పాల్గొన్నారు.
కరాటే విజేతలకు మెదక్ ఆర్డీవో అభినందన
మెదక్ అర్బన్, నవంబర్ 24 : కరాటే ద్వారా మానసికంగా దృడంగా తయారవుతారని మెదక్ ఆర్డీవో సాయిరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్లో ఈ నెల 13న హైదరాబాద్లో జరి గిన రెండో ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో మెదక్ జిల్లా నుంచి పథకాలు సాధించిన 60 మంది విద్యార్థులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరాటే నేర్చుకోవడంతో ఆత్మైస్థెర్యం పెరుగుతుందన్నారు. విద్యా ర్థులు చదువుతోపాటు ఆటలు, కళారంగాల్లో రా ణించి, ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆర్డీవో పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్లు నగేశ్, దినకర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.