చేర్యాల, ఏప్రిల్ 9: ఉగాది పర్వదినం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం లో మంగళవారం ఆలయ వర్గాలు పంచాంగ శ్రవణం నిర్వహించా రు. ఆలయంలో ఏఈవో బుద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరశైవ ఆగమ పండితులు, అర్చకస్వాములు పంచాంగ శ్రవణం వినిపించారు.
ఈ సందర్భంగా ఆల య ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ నూతన సంవత్సరంలో మల్లన్న ఆల య అభివృద్ధి, భక్తుల రాక, స్వామి వారి ఆదాయం తదితర వాటిని వివరించారు. కార్యక్రమంలో పునరుద్ధరణ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గుపూజారులు పాల్గొన్నారు.