సంగారెడ్డి అర్బన్, జూన్ 9: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం, అభివృద్ధి సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో అమలవుతున్నాయని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొని 345 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన ఆశయాలను అనుగుణంగా సీఎం కేసీఆర్ పేద, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.
గతంలో 2014 కంటే ముందు పింఛన్లు 19,000 మందికి రూ.5 వేల కోట్లు ఇచ్చారని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ 30 వేల అర్హులకు రూ.81 వేల కోట్లు ఇస్తున్నారన్నారు. గతంలో మైనార్టీ గురుకులాలు లేవని, తెలంగాణ సిద్ధించిన తర్వాత సంగారెడ్డి నియోజకవర్గానికి రెండు మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, జడ్పీడీసీ కొండల్రెడ్డి, సునీతా మనోహర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘుగౌడ్, ఎంపీపీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.