సంగారెడ్డి, ఫిబ్రవరి11: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జిల్లాలో మండల అభివృద్ధి అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఎంపీడీవోలు బదిలీ చేసిన జిల్లాలో కలెక్టర్కు రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ఈనెల 13లోగా పూర్తి కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. జిల్లాలో పని చేస్తున్న 27మంది అధికారుల్లో 20 మందిని వివిధ జిల్లాలకు బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎంపీడీవోలు జయలక్ష్మి, మల్లేశ్వర్, రవీందర్, రాములు, సుజాతానాయక్, సుమతి, విశ్వప్రసాద్, పూజ, వెంకటేశం, చంద్రశేఖర్, షాజీలోద్దీన్, మంజుల, మధులత, కే.సుజాత, సి.సుజాత, ముజాఫరుద్దీన్, బన్సీలాల్, శారదాదేవి, వెంకటేశ్వర్రెడ్డి, వెంకట్రెడ్డి ఉన్నారు.
మెదక్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మెద క్ జిల్లాలో 13 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యా రు. ఆర్.మార్టిన్లూథర్, జి.గణేశ్రెడ్డి, ఎం.వెంకటలక్ష్మమ్మ, జి.శ్రీరాములు (సిద్దిపేట), సీహెచ్ అరుంధతి (రంగారెడ్డి), కె.ప్రవీణ్ (నిజామాబాద్), డి.ఉమాదేవి, పి.శ్రీనివాస్, ఈ.యాదగిరిరెడ్డి, సీహెచ్.ఆనందమేరి, ఎ.శశిప్రభ, వి.శ్రీరాం, ఎన్.భారతీ సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.