మెదక్రూరల్, ఆగస్టు 28: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు జీవితాల్లో వెలుగులు నిండాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నా రు. సోమవారం మెదక్ మండల పరిధిలోని కోంటూరు పెద్ద చెరువులో ఎమ్మెల్యే 1,84,500 చేప పిల్లలను జడ్పీవైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మెదక్ జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ రజనితో కలిసి చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో అన్ని చెరువుల్లో జలకళ సంతరించుకోండంతో ఉచిత చేప పిల్లలను వదులుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ సర్కారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించిందన్నారు.
గ్రామస్తుల కోరిక మేరకు కోంటూరును గ్రామపంచాయతీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు 20మందికి అందజేశామని తెలిపారు. త్వరలో గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఆర్కియాలజీ ఆధీనంలో ఉన్నందున అశుర్కాన మరమ్మతులు చేపట్టలేకపోతున్నామన్నారు. సీఎం కేసీఆర్ కృషితో మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నదని, రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందన్నారు. వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను ప్రభుత్వం సరఫరా చేస్తుండగా, చేపల విక్రయానికి వాహనాలను 60శాతం రాయితీతో అందజేస్తున్నట్లు తెలిపారు. కోంటూరు, రాజ్పల్లి శివారులో ఫిషరీష్ మార్కెటింగ్ సముదాయాన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు వచ్చాయని, త్వరలోనే మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యకమంలో ఆత్మకమిటీ చైర్మన్ అంజాగౌడ్, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్రెడ్డి, వైస్ఎంపీపీ ఆంజనేయులు, సర్పంచ్లు, రాజ్యలక్ష్మీరవీందర్, సిద్దాగౌడ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కిష్టయ్య, ఎంఆర్వో శ్రీనివాస్, నాయకులు రవి, మోహన్నాయక్, వార్డు సభ్యు లు, మత్స్య శాఖ సిబ్బంది, సహకార సంఘాల నాయకులు యాదగిరి తదితరులున్నారు.