మెదక్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : మనం ప్రతి రోజూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అది పోలీసులు అప్రమత్తంగా ఉండటమే. తీవ్రవాదం, అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. అందుకే పోలీసు శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడుతూ ఎంతోమంది పోలీసులు అసువులు బా సారు. అమర పోలీసుల త్యాగాల మరువలేనివి. వారిని స్మరించుకుంటూ ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్డే)గా నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 14 మంది అమరులు
1999 సెప్టెంబర్ 13న మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్లో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్ ఎస్. రఘునందన్, కానిస్టేబుళ్లు ప్రసాద్, రాంచందర్, నర్సింహులు, ఆబేద్ హుస్సేన్లపై పీపుల్స్వార్ నక్సలైట్లు కా ల్పులు జరిపారు. ఆయుధాల కోసం వచ్చిన నక్సలైట్లు పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని, చంపి ఆ తర్వాత పోలీస్స్టేషన్ను పేల్చివేశారు. పోలీస్స్టేషన్లో ఉన్న ఆయుధాలను ఎత్తుకుపోయారు. 1991 ఏప్రిల్ 4న కౌడిపల్లి పోలీస్స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ దామోదర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ మల్లేశం కౌడిపల్లి మండలం ధర్మాసాగర్ గ్రామంలోని నక్సలైట్లు ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లా రు. అక్కడ కాపుకాసిన నక్సలైట్లు ఎస్ఐతో పాటు హెడ్కానిస్టేబుల్ను పిస్తల్, 9ఎంఎం కార్బన్తో కాల్చిచంపారు. 1997 నవంబర్ 11న శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో ఓ ఇంట్లో పీపుల్స్వార్ నక్సలైట్లు సమావేశం నిర్వహించుకున్నారనే సమాచారంతో తూప్రాన్ డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తూప్రాన్ సీఐ వెంకటస్వామి, హెడ్కానిస్టేబుల్ పెంటయ్య, శివ్వంపేట కానిస్టేబుళ్లు శ్రీనివాస్రావు, లక్ష్మణ్నాయక్, సుజాయత్అలీ అక్కడికి వెళ్తుండగా, పేలుడు పదార్థాలు పేలి అక్కడికక్కడే మృతి చెందారు. 1996 నవంబర్ 11న రాములు ఏఆర్ హెడ్కానిస్టేబుల్ నక్సలైట్ను మెద క్ నుంచి నిజామాబాద్ కోర్టుకు తీసుకెళ్తుండగా బాన్సువాడ ప్రాంతంలో ఆర్టీసీ బస్సును అడ్డగించిన నక్సలైట్లు తుపాకీతో రాములును కాల్చి చంపారు.
అమరుల కుటుంబాలకు అండగా సర్కారు
పోలీసు అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిం ది. ఆయా సంఘటనల్లో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించింది. మెదక్ జిల్లాలో 14 మం ది పోలీసులు అమరులయ్యారు. అందులో ఒకరు డీఎస్పీ కా గా, ఒకరు సీఐ, ఒకరు ఎస్ఐ, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కారుణ్యనియమకాల కింద ఉద్యోగాలను కల్పించింది.
ఫ్లాగ్ డే కార్యక్రమాలు ఇలా..
పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను రెండు సంవత్సరాల నుంచి ఫ్లాగ్డేగా చేస్తున్నారు. మెదక్ జిల్లా పరిధిలోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలతో పాటు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫికి సంబంధించి రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈ నెల 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఈ మధ్య కాలంలో తీసిన తక్కువ విడిది(3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్, (3) ఫొటోలను రాష్ట్రస్థాయి పోటీల కోసం పంపాల్సి ఉంటుందన్నారు.