తూప్రాన్ పట్టణం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజవర్గంలోని తూప్రాన్ గణనీయమైన పురోగతి సాధించింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, మంత్రి హరీశ్ రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కృషి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ పట్టుదలతో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పట్టణంలో నూతన కార్యాలయాల నిర్మాణం, ప్రధాన రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ మధ్య ఆకట్టుకునే పచ్చని చెట్లు, కూడళ్ల ఆధునికీకరణ, వాడవాడకూ సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంతో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. దీంతో తూప్రాన్ పట్టణం సరికొత్త కళ సంతరించుకుంటున్నది. అత్యాధునిక సౌకర్యాలతో, అత్యద్భుతంగా నిర్మించిన పలు కార్యాలయాలు పట్టణానికే తలమాణికంగా నిలుస్తున్నాయి.
ఈ సందర్భంగా నాడు-నేడు ఛాయా చిత్రాల సమాహారం.
తూప్రాన్, నవంబర్ 28