ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నారు. రూ.వేల కోట్లతో కొత్త దవాఖానలు నిర్మించి, అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులోకి తెస్తున్నారు. ప్రధానంగా మహిళల ఆరోగ్య పరిరక్షణపై దృష్టిసారించిన ప్రభుత్వం ఆరునెలల క్రితం పీహెచ్సీల్లో ‘ఆరోగ్య మహిళా’ కేంద్రాలను ప్రారంభించింది. మొదటి విడుతలో సంగారెడ్డి జిల్లాకు నాలుగు, మెదక్ జిల్లాకు 13 సెంటర్లు మంజూరు చేసి ప్రతి మంగళవారం ఉచితంగా చికిత్సలు, వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నది. ఈ సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో తొమ్మిది సెంటర్ల ఏర్పాటుకు మంత్రి హరీశ్రావు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం న్యాల్కల్, కంగ్టిలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, కందిలో హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, మిగతా చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఆయా సెంటర్లను ప్రారంభించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రతి మహిళ ‘ఆరోగ్యమహిళా’లో అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
– సంగారెడ్డి/ మెదక్ (నమస్తే తెలంగాణ), న్యూస్నెట్వర్క్, సెప్టెంబర్ 12
కంగ్టి/ కల్హేర్, సెప్టెంబర్ 12: మహిళల ఆరోగ్య మే ఇంటికి సౌభాగ్యమని, వారికోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం కంగ్టి, కల్హేర్ పీహెచ్సీల్లో మహిళా ఆరోగ్యకేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వాలు మహి ళా సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులులేవని, అన్ని దవాఖానల్లో నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయన్నా రు. నారాయణఖేడ్ లో వంద పడకల దవాఖానతోపాటు మాతా,శిశుసంరక్షణ కేంద్రాన్ని ఏ ర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. కల్హేర్లో 30పడకల దవాఖానను ప్రారంభించామన్నారు.
మహిళా ఆరోగ్యకేంద్రంలో మహిళలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తారని, ఇందుకోసం ప్రతి మంగళవారం మహిళలు స్థానిక దవాఖానల్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కంగ్టి ఎంపీపీ సంగీతావెంకట్రెడ్డి, జడ్పీటీసీ కోట లలితాంజనేయులు, మండలాధ్యక్షుడు గంగారం, వైధ్యాధికారులు నర్సింగ్చౌహాన్, రాజేశ్వర్, నాగమణి, నారాయణరావు వైద్యసిబ్బంది లక్ష్మ ణ్, చంద్రబాబు, నారాయణరెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, కల్హేర్ ఆత్మకమిటీ చైర్మన్ రాం సింగ్, జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఎంపీపీ సుశీలాఅంజయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దుర్గారెడ్డి, యువత అధ్యక్షుడు సంతోశ్కుమార్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ హన్మంతురావు, మండల కోఆప్షన్ సభ్యుడు గనీ, పీఏసీఎస్ చైర్మన్లు సంగారెడ్డి, గంగారెడ్డి, ఎంపీటీసీ సంగప్ప, కృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, గణపతినాయ క్, సాయిగొండ, నారాయణ పాల్గొన్నారు.