న్యాల్కల్, జూలై 13: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కులవృత్తులను ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని మల్గి గ్రామంలో రెండో విడత గొర్రెల యూనిట్లను 12 మంది లబ్ధిదారులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బిడ్డ సీఎం కేసీఆర్ ఉండడంతో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందేలా పథకాలు రూపొందిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు వచ్చాయన్నారు. 75 శాతం సబ్సిడీపై గొల్లకురుమలకు గొర్రెల యూనిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు కండ్లు మండుతున్నాయన్నారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిచడంతో పాటు రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయ యాంత్రీకరణతో రైతును రాజుగా చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులకు మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. రైతాంగంపై అవగాహన లేని నాయకులు మూడు గంటలు కరెంట్ సరిపోతుందని మాట్లాడడం సరికాదన్నారు. అనంతరం గ్రామంలో సీడీపీ పథకం కింద రూ.5 లక్షలతో నిర్మిస్తున్న బొంగెండేశ్వర మినీ ఫంక్షన్ హాల్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెంటరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎం.రవీందర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రవికుమార్, సర్పంచ్ మారుతీయాదవ్, ఎంపీటీసీ శివనంద, ఆత్మకమిటీ డైరెక్టర్ రాజు, నాయకులు ఇజ్రాల్ బాబీ, మిథున్రాజ్, వినోద్, శ్రీపతి, విఠల్, భూమరెడ్డి, పశువైద్యాధికారి అజింక్యా, కురుమ సంఘం నాయకులు వైద్యనాథ్, మారుతీ, నాగేశ్, రాకేశ్, తుకారం, బసవ తదితరులు పాల్గొన్నారు.