సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 27: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆయా కేంద్రాల్లో మొత్తం 36,153మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో 17,665మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉండగా, 18,488మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష జరగనున్నది. ప్రశ్నాపత్రాలను భద్రపర్చేందుకు 17 పోలీసుస్టేషన్లను గుర్తించారు.
పరీక్షాకేంద్రంలోకి మొబైల్స్, వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించమని అధికారులు స్పష్టం చేశా రు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్షాకేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్రామ్ సందర్శించారు. పరీక్షాకేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు.
న్యాల్కల్, ఫిబ్రవరి 27: విద్యార్థులు ఇం టర్ పరీక్షలను నిర్భయంగా, స్వేచ్ఛగా రాయాలని హద్నూర్, న్యాల్కల్ ప్రభుత్వ జూనియ ర్ కళాశాల ప్రిన్సిపాళ్లు అశోక్, మహేశ్ అన్నా రు. మంగళవారం న్యాల్కల్, హద్నూర్ గ్రా మాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం నుంచి మార్చి 14 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. న్యాల్కల్లో 684, హద్నూర్లో 341 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లోవిద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చర్యలు తీసుకున్నామన్నారు. సమయాని కి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆయా కేంద్రాల పరిధి లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని హద్నూ ర్ ఎస్ఐ రామానాయుడు తెలిపారు.