రామాయంపేట, మే 15 : మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల పెద్దమ్మ దేవాలయంలో దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగలు అర్ధరాత్రి దేవాలయం తాళాలు పగులగొట్టి హుండీని నగదుతో పాటు అమ్మవారి విగ్రహానికి ఉన్న ముక్కు పుడక, వెండి కళ్లు ఎత్తుకెళ్లారు. చోరీని ఆదివారం ఉదయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.