గజ్వేల్, ఏప్రిల్ 16: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు మంగళవారం మధ్యాహ్నం బయలుదేరారు. అదే సమయంలో కేసీఆర్ వాహనంపై అక్కడే ఉన్న ఎర్రవల్లి యువకులు గులాబీ పూల వర్షం కురిపించారు. జై కేసీఆర్… జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. యువకులకు అభివాదం చేస్తూ కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ముందుకు కదిలారు.