అందోల్/ వట్పల్లి, మార్చి 8: వట్పల్లిలోని వెంకట్ఖ్వాజా దర్గా (సద్గురువులు వారి ఆశ్రమం) ఉత్సవాలకు ముస్తాబైంది. కుల, మతాలకు అతీతంగా సర్వమత సన్నిధిగా పే రొందింది. వెంకట్ఖ్వాజా ఉర్సును శనివారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాలకు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుం డా పక్క రాష్ర్టాల నుంచి అధికసంఖ్యలో భక్తు లు దర్శించుకోనున్నారు. ఈ ఆశ్రమం(దర్గా) దివ్యమంగళ స్వరూపులైన అప్పగారి తత్వబోధనలతో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది. అప్పగారు 1986లో మాహాసమాధి అయ్యారు. అప్పటి నుంచి ట్రస్ట్ను స్థా పించి భక్తుల సౌకర్యార్థం సేవా, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం, మంచినీరు, ఉండేందుకు వసతి ఏర్పాటు చేశారు.
అప్పగారు జీవితకాలంలో వాడిన వస్తువులను జాగ్రత్తగా భద్రపర్చిన శిష్యులు మ్యూజియాన్ని నిర్మించి భక్తుల సందర్శనార్థం ఉంచా రు. ఈ మ్యూజియాన్ని ఆరాధన ఉత్సవాల సమయంలో మాత్రమే తెరుస్తారు.అప్పగారి భూఅంతర్భాగంలో ఉన్న సమాధిని సైతం అదేరోజు తెరుస్తారు. సమాధిని, మ్యూజియా న్ని చూడడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తారు. ఉత్సవాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జోగిపేట సీఐ అనిల్కుమార్ తెలిపారు. ఎస్సై కోటేశ్వర్రావుతో కలిసి దర్గాను పరిశీలించి భక్తులు బసచేసే అన్నిచోట్ల, వీఐపీల రాక సందర్భంగా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆరాధన వివరాలు 9వ తేదీ శనివారం అభిషేకం, సమాచందన ఫెయిరీ, గంధారాధన, భజన. 10 వ తేదీ ఆదివారం సమాగంధారాధన, సమాదీపారాధన, భజన. 11 తేదీ ఖురాన్ గ్రంథ పఠన, సమాస్తపారాధన, ప్రసాద వితరణ.