రామాయంపేట, సెప్టెంబర్ 19 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గొర్రెల కాపరులకు సబ్సీడీపై అందజేస్తున్న గొర్రెలపై గొర్రెల కాపరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చేరుకొని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన గొర్రెల కాపరుల వివరాలను సేకరించారు. ఒక్క గ్రామంలోనే ఫస్ట్ ఫేజ్లో 41 యూనిట్లును 861 గొర్రెలను సబ్సిడీగా ప్రభుత్వం కాపరులకు అందించింది. దీంతో క్షేత్రస్థాయిలో రెండు రాష్ర్టాలు ఢిల్లీ, అస్సాం రాష్ర్టాల ప్రతినిధులు గ్రామానికి చేరుకొని ప్రతి ఒక్క లబ్ధిదారుడి వివరాలను సేకరిం చారు. ఏడాదికి ఎంత సంపాదన వస్తుందంటూ వివరంగా అడిగారు. దీంతో వారు కూడా మాకు కేసీఆర్ ప్రభుత్వమే తమను ఆదుకున్నదని బృందం సభ్యులకు తెలిపారు. గతంలో దశాబ్దం క్రితం వరకు ముంబాయి, ఇతర పొరుగు రాష్ర్టాలకు వలస వెళ్లేవారమని కేసీఆర్ ప్రభుత్వం రావడంతో తమకు ఇబ్బందులు తప్పాయని తెలిపారు. రామాయంపేట మండంలలోనే ఒక్క కాట్రియాల గ్రామానికి ప్రభుత్వం సీఎం కేసీఆర్ సార్ దయవల్ల 41 యూనిట్లు అంటే ఒక్కో యూనిట్కు 21 గొర్రెలు మొత్తం 861 గొర్రెలను తమకు ఇచ్చారని తెలిపారు. మరో 25 యూనిట్లు రెండో ఫేస్లో రానున్నాయని బృందం సభ్యులకు తెలిపారు.
బృందం సభ్యులు గొర్రెల మందలను పరిశీలించి యూనిట్లు తీసుకున్న ఒక్కొక్కరినీ విడిగా అడిగారు. అందరూ ఒకేలా సమాధానం చెప్పడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో గొర్రెల కాపరులకు అండగా ఉండడం శుభపరిణామమన్నారు. అడవిలో జీవాలను పరిశీలించిన బృందం సభ్యులు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుపేదలకు అండగా ఉంటుందని నిరుపేదలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ గొర్రెలను బాగా చూసుకొని మరింత లబ్ధి పొందాలని సూచించారు. గ్రామం మొత్తం తిరిగి బృం దం సభ్యులు అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ, అస్సాం రాష్ర్టాల ప్రతినిధి బృందం సభ్యులు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శ్రీఅలయ్ బరాహ, అస్సాం రాష్ట్ర ఐసీసీవో డాక్టర్. బసంత్ కుమార్, రామచంద్రుడు, లోడంగి గోవర్ధన్, రాష్ట్ర గొర్ల కాపర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనువాస్ యాదవ్, ఎల్లేశ్ సర్పంచ్ కాట్రియాల శ్యాములు, రామాయంపేట, నిజాంపేట పశువైద్యులు శ్రీనివాస్, సుధాకర్ తదితరులు ఉన్నారు.