కంది, మార్చి 26: హోంవర్క్ ఇన్కంప్లీట్ ఉండడంతో టీచర్ కర్రతో విద్యార్థినిని చితకబాదింది. విద్యార్థికి వాతలు వచ్చేలా కొట్టడంతో కుటుంబ సభ్యులు, బీసీ విద్యార్థి సంఘ నాయకులు, పట్నం మాణిక్యం యువసేన నాయకులు మంగళవారం కంది కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం తీరుపై ఆందోళనకు దిగారు. కంది గ్రామానికి చెందిన ఎం.మహిత్ కేశవరెడ్డి స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో విద్యార్థి మహిత్కు ఇచ్చిన హోంవర్క్ చేయకపోవడంపై ప్రశ్నించిన టీచర్ కర్రతో మోచేతిపై వాతలు వచ్చేలా కొట్టింది. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం స్పందించి తమ తప్పును ఒప్పుకొని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో విద్యార్థి సంఘ నాయకులు, పీఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.