మెదక్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని, 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యం లో కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచందర్రాజుతో కలిసి మీ డియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలను స్వే చ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించనున్నామని, ఇందుకు మీ డియా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. 26న నామినేషన్ల స్రూట్నీ చేస్తారని, 29 వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. 15 రోజులపాటు అభ్యర్థుల ప్రచారాల తర్వాత మే 13 న పోలింగ్ ఉంటుందని, జూన్ 4న ఓట్ల లె కింపు చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రా లు అందించే కౌంటర్లు, సెక్యూరిటీ డిపాజిట్ కౌంటర్లు, కంట్రోల్ రూం, హెల్ప్ డెస్లను ఏర్పాటు చేశామని వివరించారు.
సువిధ పోర్టల్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అప్లికేషన్ సక్సెస్ అయిన తర్వాత వచ్చే పత్రాలపై అభ్యర్థి స్వయంగా సంతకం చేసి, రిటర్నింగ్ కార్యాలయాల్లో సమర్పించా ల్సి ఉంటుందన్నారు. నామినేషన్ దాఖలు చే యడానికి ఒకరోజు ముందే అభ్యర్థి తన పేరు తో ఎన్నికల ఖర్చు కోసం బ్యాంకు ఖాతా ప్రా రంభించి, ఖాతాకు సంబంధించిన వివరాలు ఆర్వో కార్యాలయంలో అందజేయాలని సూ చించారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక ప్రతిపాదకుడిని, ఇండిపెండెంట్లు, రిజిస్టర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు పదిమంది ప్రతిపాదకుల సంతకాలను సమర్పించాల్సి ఉం టుందన్నారు. ప్రతిపాదకులందరూ సంబంధిత నియోజకవర్గానికి చెందిన ఓటర్లుగా ఉం డాలన్నారు. అభ్యర్థులు నామినేషన్తోపాటు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 చెక్, చలానా రూపంలో సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలని వివరించారు.
ఈ నెల 18 నుంచి 25 తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుందని, ఉదయం 11 నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. నామినేషన్ వేసే చేసే సమయంలో అభ్యర్థి వెంట నలుగురికి మాత్రమే అనుమతి ఉందన్నారు. నామినేషన్ తోపాటు ఆస్తులు, అప్పులు, కేసులు, విద్యార్హ త పత్రాలను దాఖలు చేయాలని సూచించా రు. ప్రతిరోజూ నామినేషన్ పత్రాల తోపాటు అఫిడవిట్ పత్రాలను ఆర్వో ప్రదర్శిస్తారని చెప్పారు. అభ్యర్థి అఫిడవిట్ పత్రాలను 24గంటల్లోనే సీఈవో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామ ని ఎన్నికల అధికారి రాహుల్రాజ్ తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లోకి 3 వాహనాలు, అభ్యర్థితోపాటు నలుగురికి అనుమతి ఉందన్నారు.
ఓటర్లను డబ్బులు, మద్యం, కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేసేందు కు నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్, అకౌంటింగ్ బృందాలు, ఫె్లైయింగ్ స్వాడ్స్, స్టాటిక్ సర్వేలియన్స్లో ఖర్చుల పర్యవేక్షణ బృందాలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని కలెక్టర్ వివరించారు. జిల్లా సరిహద్దుల్లో 7 చెక్ పోస్టులు, 5 డైనమిక్ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి, పటిష్ట నిఘా, చెక్ పోస్ట్ల వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిననాటి నుంచి 19 కేసులు నమోదు చేసి రూ. 28,89,830 నగదు సీజ్ చేశామని చెప్పారు. 13 మంది వి జ్ఞప్తులను పరిశీలించి, 11 మందికి చెందిన రూ. 15,21,730 నగదు రిలీజ్ చేశామని తెలిపారు. ఇంకా రూ.13,68,100 నగదు పెం డింగ్లో ఉందన్నారు. 98,490లీటర్ల మద్యం సీజ్ చేశామని, వాటి విలువ రూ. 93,57, 003 ఉంటుందని తెలిపారు. ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో 102 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నేతలపై నాలుగు కేసులు నమోదు చేశామన్నారు. సమవేశంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ హర్దీప్సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.