మెదక్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): 74వ గణతంత్ర వేడుకలకు మెదక్ కలెక్టరేట్ ముస్తాబైంది. ఈ మేరకు జిల్లా స్థాయి అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. కలెక్టరేట్లో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం ఉంటుం ది. గణతంత్ర వేడుకలను కలెక్టరేట్లో నిర్వహించేందు కు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మెదక్ కలెక్టరేట్లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ రమేశ్ పర్యవేక్షించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అయ్యే లా చూడాలని ట్రాన్స్కో అధికారులు, అగ్ని ప్రమాద భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫైర్ స్టేషన్ అధికారులకు సూచించారు. బందోబస్తు ఏర్పాట్లు చూడాలని పోలీసు అధికారులకు తెలిపారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 25: గణతంత్ర వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ డాక్టర్ శరత్ జాతీయ పతాకం ఎగురవేయనున్నారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ ప్రసంగించనున్నారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను కలెక్టరేట్లో నిరాడంబరంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
జోష్ ఫుల్ పరుగు
పటాన్చెరు, జనవరి 25: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వేచ్ఛకు, అభివృద్ధికి, భద్రతకు, స్వపరిపాలనకు, భవిష్యత్తుకు ప్రతీకైన గణతంత్ర దినోత్సవంలో విద్యార్థులు సందడి చేయనున్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తారు. బుధవారం మండ లంలోని రుద్రారం గ్రామం ప్రాథమిక పాఠశాలలో రన్నింగ్ పోటీలు నిర్వహించారు.
బొటవేలిపై అంబేద్కర్ బొమ్మ
పెద్దశంకరంపేట, జనవరి 25: చేతి బొటన వేలిపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొ మ్మ వేసి పెద్దశంకరంపేటకు చెందిన స్వర్ణకారుడు శ్రీనివాసచారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ బొమ్మతో పాటు జాతీయ జెండా వేయడంతో పలువురిని ఆకట్టుకుంది.