మెదక్: మే16 (నమస్తే తెలంగాణ): దేశంలో ఉన్న విత్తన అవసరాల్లో దాదాపు 60శాతం తెలంగాణ నుంచి సరఫరా చేస్తూ విత్తన భాండాగారంగా రాష్ట్రం ఆవిర్భవించిందని వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం సీజన్ పంటల ప్రణాళిక, విత్తనాల సరఫరా, నకిలీ విత్తనాలను అరకట్టడంపై సచివాలయం నుంచి డీజీపీ అంజనీకుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రుఘునందన్ రావు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెట్టి తనిఖీలు చేపట్టాలని డీజీసీ అంజనీకుమార్ సూచించారు. అనంతరం మెదక్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ కల్తీ విత్తనాలు రాష్ట్రంలోకి రాకుండా తగు చర్యలు తీసుకుంట్నుమ్నరు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, వ్యవసాయ సహాయ సంచాలకులు, సీడ్ ఇన్స్పెక్టర్లు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రైతులు మోసపోకుండా చర్యలు
సంగారెడ్డి కలెక్టరేట్, మే 16: మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ముగిశాక సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఎస్పీ రమణకుమార్తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, ఉద్యాన వన శాఖ డీడీ వెంకటేశ్వర్లు ఉన్నారు.