సంగారెడ్డి ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలోని సిట్టింగ్లకు మరోసారి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ప్రకటించారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్కు టికెట్ ఖరారు చేశారు.
పటాన్చెరు నుంచి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, అందోలు నుంచి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యే మాణిక్రావు, నారాయణఖేడ్ నుంచి ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి టికెట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తమపై ఎంతో నమ్మకం ఉంచి మళ్లీ అవకాశం కల్పించారని, సీఎం కేసీఆర్ నాయకత్వం, ప్రజల ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు. తమకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన అధినేత కేసీఆర్కు, సహకరించిన పార్టీ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అన్నివర్గాల వారిని కలుపుకొని ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి, ఆందోలు, నారాయణఖేడ్, పటాన్చెరు, జహీరాబాద్లో బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి.
హ్యాట్రిక్ దిశగా మహిపాల్రెడ్డి..
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతున్నారు. సీఎం కేసీఆర్ పటాన్చెరు అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని ప్రకటించారు. మూడో సారి బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన పోటీ చేయనున్నారు. ఎంపీపీగా రాజకీయ అరంగేట్రం చేసిన మహిపాల్రెడ్డి అంచలంచలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు తాను నియోజకవర్గంలో చేసిన పనులు తనను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని మహిపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్నాపూర్ వరకు మెట్రోరైల్ విస్తరణ, 200 పడకల సూపర్స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు, మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు చేశారన్నారు.
సంగారెడ్డిలో చింతా ప్రభాకర్..
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా చింతా ప్రభాకర్ బరిలోకి దిగనున్నారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్కు సీఎం కేసీఆర్ మరోమారు ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అవకాశం కల్పించారు. ఇటీవల ఆయన స్వల్ప అనారోగ్యానికి గురైనా సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో జనంలో ఉంటున్నారు.సదాశివపేట మున్సిపల్చైర్మన్గా రాజకీయ జీవితం ప్రారంభించన చింతా ప్రభాకర్ ప్రజల కోసం శ్రమిస్తూ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. 2009లో ఎన్నికల్లో పోటీచేసిన ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా 32వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి 2వేల పైచిలుకు స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మూడోసారి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గులాబీ పార్టీ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, లా కాలేజీలు మంజూరు చేయడంతో పాటు నియోజకవర్గాన్ని ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేశారని, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.
స్థానికుడైన క్రాంతికిరణ్కు టికెట్
అందోలు నియోజకవర్గం నుంచి స్థానికుడైన చంటి క్రాంతికిరణ్కు సీఎం కేసీఆర్ మరోమారు మరోసారి టికెట్ ఇచ్చారు. చంటి క్రాంతికిరణ్ గులాబీ పార్టీ నుంచి రెండో మారు అందోలు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. జర్నలిస్టుగా ఉన్న చంటి క్రాంతికిరణ్ జడ్పీటీసీగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. రామచంద్రాపురం జడ్పీటీసీగా పనిచేసిన ఆయన, ఆతర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2018లో అందోల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 16వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. సీఎం ఆశీస్సులతో మరోమారు తాను ఎమ్మెల్యేగా గెలువడం ఖాయమని, స్థానికుడైన తనకు ప్రజల మద్దతు ఉందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు.
మూడోసారి బరిలో భూపాల్రెడ్డి
నారాయణఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మూడోసారి గులాబీ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. 2008లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన భూపాల్రెడ్డి 2009, 2014లో నారాయణఖేడ్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో 53వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ భూపాల్రెడ్డి 58వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో మూడోసారి గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. వెనుకబడిన నారాయణఖేడ్ నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేయడంతో పాటు బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ను సస్యశ్యామలం చేయనున్నట్లు చెప్పారు.
జహీరాబాద్ నుంచి మూడోసారి మాణిక్రావు
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మారోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఆయన పోటీ చేయనున్నారు. ఝరాసంగం గ్రామానికి చెందిన మాణిక్రావు సీఎం కేసీఆర్ ప్రోద్భలంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తాయని మాణిక్రావు ధీమా వ్యక్తం చేశారు.
సంగారెడ్డి టికెట్ బీసీకే..
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ల ప్రకటనలో సామాజిక కూర్పునకు ప్రాధాన్యత ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా రెండు సీట్లు ఎస్సీ సామాజికవర్గానికి, రెండు సీట్లు ఓసీలకు, ఒక సీటు బీసీకి కేటాయించారు. ఎస్సీలకు రిజర్వు అయిన అందోలు, జహీరాబాద్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావులకు మరోమారు టికెట్లు కేటాయించారు. పటాన్చెరు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, భూపాల్రెడ్డిలకు ఇచ్చారు. ఇక జిల్లాలో బీసీలకు సైతం సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. అత్యంతకీలకమైన సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ను బీసీ సామాజికవర్గానికి చెందిన చింతా ప్రభాకర్కు కేటాయించారు. గత ఎన్నికల్లో సైతం సీఎం కేసీఆర్ చింతా ప్రభాకర్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 21 : సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సీఎం ఎన్నికల అభ్యర్థులను ప్రకటించడంపై సంగారెడ్డి నియోజకవర్గం నుంచి తనకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించడాన్ని స్వాగతిస్తూ అందోల్ నియోజకవర్గం నుంచి తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం కాబోతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పటాన్చెరు- గూడెం మహిపాల్రెడ్డి
పేరు : గూడెం మహిపాల్రెడ్డి
విద్యార్హత : ఇంటర్
పుట్టిన సంవత్సరం : 19-10-1963
పుట్టిన స్థలం : పటాన్చెరు
తల్లిదండ్రులు : గూడెం సత్తిరెడ్డి, మణెమ్మ
శాశ్వత అడ్రస్ : పటాన్చెరు
పిల్లలు : ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
ప్రొఫెషన్ : రైతు
జహీరాబాద్- కొనింటి మాణిక్రావు
పేరు : కొనింటి మాణిక్రావు
విద్యార్హత : మెకానికల్ ఆటోమొబైల్ డిప్లొమా
పుట్టిన సంవత్సరం : 9-7-1953
తల్లిదండ్రులు : బాలప్ప, లక్ష్మమ్మ
ప్రస్తుత అడ్రస్ : గ్రామం, మండలం ఝరాసంగం, నియోజకవర్గం జహీరాబాద్
చేపట్టిన పదవులు
సంగారెడ్డి – చింతా ప్రభాకర్
పేరు : చింతాప్రభాకర్
తండ్రిపేరు : చింత నాగభూషణం
తల్లి పేరు : చింత లక్ష్మమ్మ
విద్యార్హతలు : ఇంటర్మీడియట్
పుట్టిన తేదీ : సదాశివపేట, 10 ఆగష్టు 1959
చిరునామా : ఇంటి నంబరు. 4-1-1/8/5, సదాశివ ఎన్క్లీవ్, గురునగర్ కాలనీ, సదాశివ పేట, జిల్లా సంగారెడ్డి, పిన్ : 502291
భాషలు : తెలుగు, హిందీ, ఇంగ్లిష్
రాజకీయ ప్రవేశం : టీడీపీతో మున్సిపల్ చైర్మన్ 1995
చేపట్టిన పదవులు : టీఆర్ఎస్తో ఎమ్మెల్యేగా 2014లో గెలుపు, 2022 బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, 2022 నుంచి టీఎస్హెచ్డీసీ చైర్మన్
మెదక్- పద్మాదేవేందర్రెడ్డి
పేరు : ఎం.పద్మాదేవేందర్రెడ్డి
విద్యార్హత : బీఏ, ఎల్ఎల్బీ
పుట్టిన సంవత్సరం : 6-1-1969
పుట్టిన స్థలం : కరీంనగర్
తల్లిదండ్రులు : కె.భూంరెడ్డి, విజయ
ప్రస్తుత అడ్రస్ : ప్లాట్నం.204, గుమ్మడిప్రెస్టెజ్ పార్క్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్
అడ్రస్ : కోనాపూర్ గ్రామం.
రామాయంపేట మండలం
రామాయంపేట (2001-2004) జడ్పీ ఫ్లోర్ లీడర్
ఎమ్మెల్యే రామాయంపేట (2004)
: 2014-2018 వరకు మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్
: 2018-2023 వరకు మెదక్ ఎమ్మెల్యేగా..
నారాయణఖేడ్ – మహారెడ్డి భూపాల్రెడ్డి
పేరు : మహారెడ్డి భూపాల్రెడ్డి
విద్యార్హత : బీఎస్సీ డిగ్రీ, ఏవీ.కాలేజ్, హైదరాబాద్
పుట్టిన సంవత్సరం : 7-5-1960
పుట్టిన స్థలం : ఖానాపూర్(కె), కల్హేర్ మండలం
తల్లిదండ్రులు : మహారెడ్డి వెంకట్రెడ్డి, శకుంతలమ్మ
ప్రస్తుత అడ్రస్ : నారాయణఖేడ్
చేపట్టిన పదవులు :
అందోల్- చంటి క్రాంతి కిరణ్
పేరు : చంటి క్రాంతి కిరణ్
విద్యార్హత : బీఏ(ఎల్ఎల్బీ)
పుట్టిన సంవత్సరం : 6-12-1976
పుట్టిన స్థలం : పోతులబొగుడ
తల్లిదండ్రులు : చంటి కొమురమ్మ(దివంగత), భూమయ్య
ప్రస్తుత అడ్రస్ : పోతులబొగుడ, వట్పల్లి మండలం సంగారెడ్డి జిల్లా
ప్రొఫెషన్ : జర్నలిస్టు
చేపట్టిన పదవులు : గతంలో రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2009లో ఇండిపెండింట్ అభ్యర్థిగా అందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.