మిరుదొడ్డి, సెప్టెంబర్ 22 : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శుక్రవారం ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో కలిసి హైదరాబాద్లో ఆర్థిక, వైదారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావును కలిశారు. పూలబొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు రుణపడి ఉంటానని వెంకటయ్య చెప్పారు. ఆయనవెంట దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ నమిలె భాస్కరాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మామిడి మోహన్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ మండల నాయకుడు గుండం రాజమహేందర్రెడ్డి పాల్గొన్నారు.