అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులు ఏ మాత్రం అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు భరోసా కల్పించారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో వారు పంటపొలాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందిస్తామని, సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆదుకుంటారని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేసేలా కృషి చేస్తామన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం దర్పల్లిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లోని గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పర్యటించి రైతులతో మాట్లాడి ధైర్యాన్నిచ్చారు.
– మెదక్/ సంగారెడ్డి న్యూస్ నెట్వర్క్, మే 2
నర్సాపూర్/ వెల్దుర్తి/ శివ్వంపేట, మే 2 : అకాల వర్షం, వడగండ్లతో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, మీకు మేమున్నామని.. ఎమ్మెల్యే మదన్రెడ్డి భరోసానిచ్చారు. నర్సాపూర్ మండలంలోని అచ్చంపేట్, బ్రాహ్మణపల్లి గ్రామా ల్లో వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను మంగళవారం ఎమ్మెల్యేతోపాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్ మండలంలోని అచ్చంపేట్, నారాయణపూర్, లింగాపూర్, బ్రాహ్మణపల్లి, మల్పర్తి గ్రా మాల్లో వరి పంటలు దెబ్బతాన్నాయన్నా. మండల వ్యాప్తంగా 390 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారని తెలిపారు.
వ్యవసాయాధికారులు పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని, రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాల ఆదుకుంటారని, వర్షానికి తడిసిన ధాన్యంతోపాటు మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్గుప్తా, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సత్యాగౌడ్, తహసీల్దార్ ఆంజనేయులు, ఏడీఏ సురేఖ, ఏవో అనిల్కుమార్, ఏఈవో దుర్గాప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు వంజరి శ్రీనివాస్, నర్సింగ్, కొండల్ పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులకు త్వరలో పరిహారం
వెల్దుర్తి మండలం వర్ధవానిచెర్వుతండా, శేరీల గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈదురుగాలులు, వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఆకస్మత్తుగా వచ్చే విపత్తులను ఎవరూ ఆపలేరని, ఇటువంటి సమయంలో అన్నదాతలు ధైర్యంగా ఉండాలని సూచించారు. అకాల వర్షాలు, పంటల నష్టంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉన్నతాధికారులు, మంత్రులతో స మావేశం నిర్వహించి, తగిన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ రమేశ్గౌడ్, వెల్దుర్తి, మా సాయిపేట సర్పంచ్లు అశోక్రెడ్డి, మధుసూదన్రెడ్డి, ఎంపీటీసీలు మోహన్రెడ్డి, సోనీశ్రీనినాయక్, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, డైరెక్టర్ నర్సింహులు, తహసీల్దార్ మాలతి, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, ఏపీవో శంకరయ్య, నాయకులు నరేందర్రెడ్డి, నాగరాజు, అశోక్గౌడ్, స్టేషన్ శ్రీను, శ్రీనినాయక్, శ్రీధర్గుప్తాతోపాటు వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
శివ్వంపేట మండలంలోని పాంబండ, భీమ్లతండా, రత్నాపూర్, కొత్తపేట, పిల్లుట్ల, లింగోజిగూడ, తాళ్లపల్లి తండాల్లో పంటలను ఏడీఏ సురేఖతో కలిసి ఎమ్మెల్యే మదన్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేల పరిహారం ఇస్తామన్నారు. యుద్ధ్దప్రతిపాదికన పంటల నష్టం వివరాలను సేకరించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఆర్ఐ కిషన్, ఏవో లావణ్య, ఏఈవోలు సుభా ష్, రవివర్మ, మౌనిక, ఎంపీటీసీ వాణీరామ్మోహన్రెడ్డి, సర్పంచ్లు సోనీరవినాయక్, పోతరాజ బాబూరావు, పెద్దపులి రవి, సీనియర్ నాయకులు బండారి గంగాధర్, రాజశేఖర్గౌడ్, చింతస్వామి ఉన్నారు.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం : మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి
కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధ్దంగా ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి తెలిపారు. చేతికొచ్చిన వరి పంట అకాల వర్షానికి నష్టపోవడం బాధాకరంగా ఉందన్నారు. రైతులు దిగులు చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతులకు తప్పకుండా న్యాయం చేస్తారని తెలిపారు.
ప్రతి రైతునూ ఆదుకుంటాం : మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
చిన్నశంకరంపేట, మే 2 : అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హామీ ఇచ్చారు. చిన్నశంకరంపేట మండలంలోని దర్పల్లిలో వరి పంటను వ్యవసాయశాఖ అధికారులలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు పరిశీలించారు. రైతులతో ఫోన్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడారు. రైతులు అధైర్యపడొద్దని నష్టపరిహారం అందే విధంగా చూస్తానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏవో లక్ష్మీప్రవీణ్, సర్పంచ్ సిద్ధ్దిరాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఉప్పరి శ్రీను, నాయకులు మహిపాల్రెడ్డి, లింగారెడ్డి, లింగారెడ్డి, సుధాకర్నాయక్, రవీందర్ పాల్గొన్నారు.
పంటలను పరిశీలించిన డీఎఫ్వో
పెద్దశంకరంపేట/ రేగోడ్, మే 2 : పెద్దశంకరంపేట మండలంలో ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా అటవీశాఖ అధికారి, మండల ప్రత్యేకాధికారి రవిప్రసాద్ పరిశీలించారు. టెంకటి గ్రామంలో పర్యటించి, వర్షా లకు దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, జొన్న పంటలను పరిశీలిం చి, రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డీఎఫ్వో వెంట ఏఈవో స్వాతి, సర్పంచ్ సుధాకర్ ఉన్నారు. రేగోడ్ మండలం జగిర్యాల గ్రామంలో సుమారు 15 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు మానయ్య, బోయిని బక్కయ్య, బస్వరాజ్ తదితరులు తెలిపారు. వ్యవసాయ అధికారులు పంటనష్టం వివరాలు సేకరించాలని కోరారు.