మనోహరాబాద్/ కొల్చారం/ రామాయంపేట/ టేక్మాల్, డిసెంబర్ 31 : సీఎం కేసీఆర్ అందజేస్తున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్లో మహిళా సంఘం సభ్యులతో కలిసి శనివారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ… ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు శ్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 2 లక్షల రుణాన్ని అందజేస్తుందన్నారు. ఫుడ్స్ యూనిట్లకు రూ. 10 నుంచి రూ.30 లక్షల వరకు 35శాతం సబిడ్సీపై రుణాలను అందజేస్తుందన్నారు.
మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వాలంభన సాధించాలన్నారు. అనంతరం డీసీసీబీ బ్యాంకు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ నాగిరెడ్డి, డీసీసీబీ మేనేజర్ భాగ్యలక్ష్మి, ఐకేపీ ఏపీఎం పెంటాగౌడ్, సీసీలు కృష్ణవేణి, విజయలక్ష్మి, శోభారాణి, సమా ఖ్య అధ్యక్షురాలు అనిత, సీఏలు, వీవోవోలు పాల్గొన్నారు.
దీర్ఘకాలిక రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
– మంబోజిపల్లి శాఖ మేనేజర్ సౌభాగ్య
కొల్చారం మండలం చిన్నాఘన్పూర్లో విలేజ్ లెవెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ ఇందిరాప్రియదర్శిని అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిసీసీబీ మంబోజిపల్లి శాఖ మేనేజర్ సౌభాగ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ సౌభాగ్య మాట్లాడుతూ.. డీసీసీబీ ఇచ్చే దీర్ఘకాలిక రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మహిళా సంఘాలకు రూ. లక్ష నుంచి రూ.20లక్షల వరకు రుణాలు, బంగారంపై తులానికి రూ. 36000, ఎడ్యుకేషన్ రుణాలు, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎమ్ఈ, లాంగ్ టర్మ్లోన్స్(వడ్డీ రేటు 10.5 శాతం) లాం గ్టర్మ్లో భాగంగా డెయిరీ, ఫౌల్ట్రీ, ట్రాక్టర్, హార్వెస్టర్, వాహ న, వ్యవసాయ రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. హోమ్లోన్స్ రూరల్లో రూ.15లక్షలు, మండలంలో రూ.25లక్షలు, అర్బన్లో రూ.40లక్షలు, సహకార సమృద్ధి డిపాజిట్లో 7.75శాతం వడ్డీరేటుకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివ రించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణగౌడ్, ఫీల్డ్ ఆఫీసర్ యాదగిరి, సీసీ సబిత, సీఏలు పాల్గొన్నారు.
రైతులకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు
– పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, డీసీసీబీ మేనేజర్ ప్రణీద్
రామాయంపేట, నిజాంపేట మండలాల్లో అర్హులైన ప్రతి రైతుకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను ఇచ్చేందుకు సొసైటీ సిద్ధంగా ఉందని రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, డీసీసీబీ మేనేజర్ ప్రణీద్నాయక్ అన్నారు. రామాయంపేటలోని డీసీసీబీలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఈవో నర్సింహులు, బ్యాంకు సిబ్బంది రాజు, మహేశ్, శ్రీనివాస్, దుర్గారెడ్డి ఉన్నారు.
అందరికీ రుణాలు : బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్
డీసీసీబీ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని టేక్మాల్ చ్రాండ్ మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు. టేక్మాల్ మండలంలోని చంద్రుతండాలో గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. డీసీసీబీలో సులభంగా అర్హులకు రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా ఫోన్పే, గూగుల్పే సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతీసర్దార్, ఎంపీటీసీ మోహన్, పీఏసీఎస్ డైరెక్టర్ చందర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు.