మెదక్ జిల్లావాసుల చిరకాల కోరిక నెరవేరింది. చాలాకాలంగా చేస్తున్న కృషికి ఫలితం దకింది. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు విజ్ఞప్తి చేయగా, బుధవారం మెదక్కు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాల స్థాపనకు, మెదక్లో 100 ఎంబీబీఎస్ సీట్ల కెపాసిటీతో ప్రభుత్వ జనరల్ దవాఖానను అప్గ్రేడ్ చేయడానికి అనుమతులు ఇచ్చింది. మెడికల్ కళాశాల మంజూరుతో ఉన్నతవిద్య అందుబాటులోకి రావడంతోపాటు జిల్లా ప్రజలకు మరిన్ని వైద్యసేవలు అందనున్నాయి. మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రి హరీశ్రావుకు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
– మెదక్, జూలై 5 (నమస్తే తెలంగాణ)
రాష్ట్రంలో వైద్య విప్లవం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆరోగ్య తెలంగాణను సహకారం చేసే దిశగా వైద్యారోగ్యశాఖలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటికే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా సర్కారు దవాఖానలను మెరుగుపర్చి సేవలందించేలా చర్యలు చేపట్టారు. నిరుపేదలకు సైతం వైద్య విద్యను చేరువ చేసేందుకు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కళాశాలలు ఏర్పాటు చేయగా, తాజాగా మెదక్ జిల్లాకు సైతం మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ బీఆర్ఎస్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా దవాఖానకు మరో వంద పడకలు, నర్సింగ్ కళాశాల మంజూరు కానున్నాయి. మెడికల్ కళాశాల మంజూరుతో మెదక్ జిల్లా కేంద్రంలో సంబురాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మెదక్, జూలై 5 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో మెడికల్ కళాశాలను మంజూరు చేయగా, ఇందులో మెదక్ మెడికల్ కళాశాల ఒకటి. కళాశాల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రావడంతో ప్రజలకు సేవలు అందడంతో పాటు విద్యార్థులు వైద్య విద్య చదివేందుకు అవకాశం కలగనున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
నెరవేరిన చిరకాల కల
మెదక్ జిల్లా చిరకాల కోరిక నెరవేరింది. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషికి ఫలితం దకింది. గతేడాది నుంచే మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్కు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావును కోరారు. బుధవారం మెదక్కు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలో ఉన్న మెదక్ ప్రభుత్వ ప్రధాన దవాఖానను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపనకు, మెదక్లో 100 ఎంబీబీఎస్ సీట్ల కెపాసిటీతో ప్రభుత్వ జనరల్ దవాఖానను అప్గ్రేడ్ చేయడానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు రోడ్లు, భవనాల విభాగానికి అప్పగించారు. ప్రభుత్వ జనరల్ దవాఖానను అప్గ్రేడ్ చేయడం, పరికరాలు, ఫర్నిచర్ సేకరణ పనులు టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగించారు. వైద్య కళాశాల మంజూరుతో మెదక్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని విద్యార్థులు వైద్య విద్య కోసం హైదరాబాద్, వరంగల్తో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. మెడికల్ కళాశాల మంజూరుతో ఉన్నత విద్య అందుబాటులోకి రానున్నది.
ప్రజలకు చేరువకానున్న మరిన్ని సేవలు…
మెదక్ జిల్లాలో ఇప్పటికే జిల్లా కేంద్ర దవాఖానతోపాటు ఎంసీహెచ్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. 100 శాతం ఎంసీహెచ్లోనే గర్భిణులకు ప్రసవాలు జరుగుతున్నాయి. మెదక్ దవాఖానలో డయాలసిస్తో పాటు ఐసీయూ, రేడియోలజీ, తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్, ఎంసీహెచ్లో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఒకప్పుడు రోగులు, ప్రజలు వైద్య సేవల కోసం హైదరాబాద్కు వెళ్లే పరిస్థితి ఉండేది. దీంతో ఆర్థికంగా నష్టపోయేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యానికి పెద్దపీట వేస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ఇక మెదక్లో మెడికల్ కళాశాల ఏర్పాటు కావడంతో ఖరీదైన శస్త్ర చికిత్సలు ఇక్కడే చేసేందుకు అవకాశం ఉంటుంది.
మెడికల్ కళాశాల మంజూరుపై ఎమ్మెల్సీ హర్షం
మెదక్, జూలై 5 (నమస్తే తెలంగాణ): దశాబ్దాల నుంచి వివక్షతో వైద్యవిద్యకు దూరమైన తెలంగాణ విద్యార్థులకు సీఎం కేసీఆర్ కృషితో మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రాంతాల్లో మెడికల్ కళాశాలను మంజూరు చేయగా, ఇందులో మెదక్ మెడికల్ కళాశాల ఉందన్నారు. కళాశాల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నుంచి అనుమతులు వచ్చాయన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. మెదక్ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేది కేవలం సీఎం కేసీఆర్ సర్కారేనని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ విద్యార్థులు విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించడానికి వెళ్లే రోజులు తగ్గి వారికి అందుబాటులోకి వైద్యవిద్య రానుందని సంతోషం వ్యక్తం చేశారు.
మెదక్ ప్రజల చిరకాల స్పప్నం నెరవేరింది
మెదక్ మున్సిపాలిటీ, జూలై 5: మెదక్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని, మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్కు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి. మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడంపై బుధవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెదక్కు మెడికల్ కళాశాల మంజూరుతో ఈప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మెదక్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే మెదక్లో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని, రైలు సైతం తెచ్చుకున్నామని తెలిపారు. ఇప్పుడు మెడికల్ కళాశాల మంజూరు చేసుకున్నామన్నారు. జిల్లా కేంద్రానికి మరో వంద పడకల దవాఖాన మంజూరైందని, నర్సింగ్ కళాశాల రాబోతున్నదని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేదలకు పేద ప్రజలు మంచి వైద్యం అందుతుందన్నారు. త్వరలోనే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాల ప్రారంభానికి సీఎం కేసీఆర్ రానుయన్నాని తెలిపారు. ఆరోజే మెడికల్ కళాశాల స్థలం మంజూరుతో పాటు నిధులు సైతం ప్రకటించనున్నట్లు ఆమె తెలిపారు.
ఘనంగా సంబురాలు..
మెడికల్ కళాశాల మంజూరుతో మెదక్ రాందాస్ చౌరస్తాలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, పటాకులు కాల్చారు. అనంతరం స్వీట్లు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘కేసీఆర్ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, కిశోర్, ఉమర్, మాజీ కౌన్సిలర్ సోహేల్, శ్రీనివాస్, ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్, ఎంఎంసీ మాజీ చైర్మన్ మధుసూదన్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సతీశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, నాయకులు లింగారెడ్డి, దుర్గప్రసాద్, జుబేర్, శివరామకృష్ణ, శ్రీకాంత్, రమేశ్, నగేశ్, ఉమర్ పారుఖ్, సంశాన్ సందీప్, నవీన్, కిరణ్, నరేందర్, సాయిలు, అరవింద్గౌడ్, శంకర్, దుర్గయ్య, బాగారెడ్డి, హనుమంత్రెడ్డి, మహేందర్రెడ్డి, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.