హుస్నాబాద్, ఏప్రిల్ 10 : ఎన్నికలకు ముందు ఉచిత పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని ఉద్దెర పథకాలుగా మార్చి ప్రజలను మోసం చేస్తున్నదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు ఉద్దెర పథకాలేనన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మచెరువు కట్టపై వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మల్లెచెట్టు చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు ఇంటింటికీ తిరిగి ఎంపీగా గెలిపిస్తే చేయబోయే అభివృద్ధి పనులు, గతంలో చేసిన అభివృద్ధ్దిని వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. హమాలీలను కలిసి వారి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు పథకాలను ఇంకా అమలు చేయకుం డా ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. మహిళలకు రూ.2,500 నగదు, రూ.4వేల పింఛన్, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15వేలు ఏవని ప్రశ్నించారు. ప్రజ లు సమస్యలతో బాధపడుతున్నారని, రైతులు కరువుతో అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వినోద్కుమార్ విమర్శించారు.
జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలని 1985లో అప్పటి ప్రభుత్వం చట్టం తెచ్చిందని, దీని ప్రకారం తెలంగాణలో మరో 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉందని బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తాను ఎంపీగా గెలిస్తే జిల్లాకో నవోదయ పాఠశాలను మంజూరు చేయించడంతోపాటు హుస్నాబాద్లో నవోదయ పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు ఒక్క నవోదయ పాఠశాలను తెచ్చిన పాపాన పోలేదన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఐదేండ్లలో ఐదు రూపాయలు కూడా కేంద్రం నుంచి తేలేదని విమర్శించారు. ఈజీఎస్, ఎరువుల సబ్సిడీ తానే ఇప్పిస్తున్నట్లు అబద్ధ్దపు ప్రచారం చేస్తున్నాడన్నారు. తాను ఎంపీగా ఉన్న ఐదేండ్లలో రహదారులు, రైల్వేలైన్లు మం జూరు చేయించినట్లు చెప్పారు. ఎల్కతుర్తి-హుస్నాబాద్-సిద్దిపేట నుంచి నాందేడ్ వరకు హైవేతో పాటు హైదరాబాద్ నుంచి వేములవాడ వరకు రైల్వేలైన్ తెచ్చామన్నారు. కరీంనగర్ స్మార్ట్సిటీకి రూ.వెయ్యికోట్లు మంజూరు చేయించామని తెలిపారు. కృష్ణా, గోదావరి నీళ్ల కేటాయింపులు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుండి పనిచేశామన్నారు. ప్రజలు మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజల గొంతుకనై పార్లమెంటులో ప్రజా సమస్యలపై పోరాడుతానని హామీనిచ్చారు. 24గంటలు కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవకు అంకితమవుతానని, కారు గుర్తుకు ఓటేసి ఎం పీగా గెలిపించాలని వినోద్కుమార్ కోరారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు తాను ఎంపీగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కలిసిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ బోయినపల్లి వినోద్కుమార్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి హుస్నాబాద్ పట్టణంలో తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. వాకర్స్తో మాట్లాడి తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించాలని కోరారు. మార్నింగ్ వాక్ చేస్తూ కలిసిన ప్రతి ఒక్కరినీ ఏం చేస్తుంటావు… వచ్చే ఎన్నికల గురించి తెలుసా అని ప్రశ్నించారు. కూరగాయల దుకాణాలు, టీ, కిరాణ దుకాణాదారుల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాలినడకన ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశా రు. ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద హుస్నాబాద్లో గులాబీ ప్రచారానికి తెరలేపారని చెప్పొచ్చు. దీంతో పట్టణంలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలూనాయక్, మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, గూల్ల రాజు, వాల సుప్రజనవీన్, గోవిందు రవి, రత్నారవీందర్రావు, బోజు రమారవి, ఎండీ అన్వర్, తిరుపతిరెడ్డి, ఆకుల వెంకట్, సుధాకర్, ఇంద్రాల సారయ్య, చిట్టి గోపాల్రెడ్డి, లక్ష్మణ్నాయక్, పూదరి రవీందర్, విజయభాస్కర్, బండి పుష్ప, చిరంజీవి, గుగులోతు రాజు, సత్యంనాయక్, పెసరు సాంబరాజు, మ్యాక నారాయణ, యాస శ్రీనివాస్, భగవాన్ పాల్గొన్నారు.