సిద్దిపేట, నవంబర్ 27 : సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో సిద్దిపేటలోశ్రీకృష్ణ కాలచక్రం పేరిట నిర్వహిస్తున్న అయుత చండీ..ఆతిరుద్ర యాగం, శ్రీసీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం,78వ, విశ్వశాంతి మహాయాగం శనివారం 9వరోజు కొనసాగింది. యాగంలో భాగంగా ఆదివారం సూర్య సరస్వతీ హోమం, విశేష సూర్య నమస్కారాలు నిర్వహించారు. యాగశాలలో 800 మంది రుత్వికులతో వేద పారాయణం చేశారు. శివాభిషేకం చేశారు.గోపూజ,తులసిపూజ, సహస్ర లింగార్చన, రుద్రాభిషేకాలు, కోటి పారాయణ భజనలు, రుద్రక్రమార్చన, లక్ష బిల్వార్చన, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సుమారు 5వేల మంది భక్తులకు ఆన్నదానం చేశారు.