జహీరాబాద్, ఏప్రిల్ 6 : రాష్ట్రంలో ఉపాధి హామీలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పేస్కేల్ అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావుకు ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు.
గురువారం మొగుడంపల్లి మండలంలోని ధనసిరి గ్రామంలో ఉన్న రైతు వేదిక వద్ద మంత్రికి ఉద్యోగులు సమస్యలు వివరించారు. సంగారెడ్డి జిల్లా జేఏ సీ నాయకులు గురుపాదం, లక్ష్మారెడ్డి, ఇక్బాల్, శంకర్రావు, శ్రీనివాస్, ఆషిక్, యాదవ్రావు తదితరులు ఉన్నారు.