పటాన్చెరు, డిసెంబర్ 2 : ఎన్నికల కౌంటింగ్కు జిల్లా అధి కార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఓటర్ల తీర్పు ప్రక టించడానికి ఓట్ల లెక్కింపునకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా పారదర్శంగా కౌంటింగ్ ప్రక్రి య నిర్వహించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా టేబు ళ్లు వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెటన్లు లెక్కించడానికి ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ చేపడుతున్నారు. కౌంటింగ్ హాల్ దృశ్యాలు పెద్ద డిజిటల్ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఏజెంట్లు స్పష్టంగా పడిన ఓట్లను చూసేలా మెష్ ఏర్పాటు చేశారు. ఏజెంట్లు లోపలికి రాకుండా అడ్డుగా తెరలు పెట్టారు. పూర్తిస్థాయిలో పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల అబ్జర్వర్లు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లను కలెక్టర్ శరత్ శనివారం పరిశీలించారు. ఎన్నికల సంఘం పేర్కొన్న అన్ని నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు. కౌం టింగ్లో ఏజెంట్లు అడిగే ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేయాలని కలె క్టర్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్లను ఏజెంట్ల ఎదుట ప్రదర్శించాలని సూ చించారు. ప్రతి ఓటూ విలువైనదని, ఎక్కడా పొరపాటు జరగకుండా చూ డాలని రిటర్నింగ్ అధికారులకు సూ చించారు. సీసీకెమెరాలు, స్ట్రాంగ్రూం వద్ద రక్షణ ఇతర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. లెక్కింపు ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం కోసం ఏ ర్పాటు చేసిన తెరలను పరిశీలించి, వాటి పనితీరు పరిశీలించా రు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డింగ్ అవుతున్నది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత బలగాలను మోహరించారు. మొత్తంగా గీతం డీమ్డ్ యునివర్సిటీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది, అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ప్రెస్కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఫలితాలను రౌండ్లవారీగా అధికారులు తెలియజేస్తారు.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో పోలీసులు మూడంచెల రక్షణ కల్పిస్తున్నారు. గీతం కౌంటింగ్ హాల్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని అదనపు ఎస్పీ అశోక్ తెలిపారు. కౌంటింగ్ సెంటర్ వద్ద ఉదయం 6గంటల నుంచి పోలీసు నిబంధనలు అమలు అవుతాయన్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని, గుర్తింపు కార్డు ఉన్నవారికే అనుమతి ఇస్తామన్నారు. ధర్నాలు, మైకులు వాడితే చర్యలుంటాయన్నారు. ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కౌంటింగ్ ఏజెం ట్లు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని కోరారు. 500 మంది పోలీసులు ఎన్నికల కౌంటింగ్ విధుల్లో ఉన్నారన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, అబ్జర్వర్లు, ఆర్వోలు పాల్గొన్నారు.