జనగామ రూరల్, అక్టోబర్ 21: బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దీంతో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్, పెద్దతండా(వై), అడవికేశ్వాపూర్, వెంకిర్యాల గ్రామాల్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ బోటకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎర్రగొల్లపహాడ్లో బట్టలను ఇస్త్రీ చేయడం, కుమ్మరి వారి ఇంట్లో కుండలు తయారు చేయడం, చిన్నపిల్లలను లాలించడం, కిరాణా దుకాణంలో చాక్లెట్లు అమ్మడం, గాజుల షాపులో గాజులు అమ్మడం, పండుముసలి నుంచి పడుచు వయస్సు వారితో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఇక్కడి ప్రాంతం పోరాటాల గడ్డ అని ఇక్కడి ప్రజలకు చైతన్యం ఎక్కువ ఉంటుందన్నారు. గ్రామాల్లోని సమస్యలను సర్పంచులు, గ్రామ నాయకులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్లను వేయడానికి కృషి చేస్తానని, లేని గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మిస్తామన్నారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనాలు నిర్మించుకోవడం కోసం కృషిచేస్తానన్నారు. క్రీడా మైదానలు, అంగన్వాడీ, మహిళా సంఘం భవనాలు నిర్మిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందించడానికి శాయశక్తుల కృషి చేస్తామన్నారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు, 24గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ర్టాలు లేవని, కుల వృత్తులను బలోపేతం చేసి వారికి ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని ఇక్కడి పథకాలు ఇతర రాష్ర్టాల వారు కాపీ కొట్టి ఇప్పుడు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు అమలు చేస్తున్న మ్యానిఫెస్టో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేవిధంగా ఉందన్నారు. ప్రతి పేదవాడు ఉన్నత వంతుడిగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ తయారు చేశారన్నారు. ఏఅవసరం వచ్చినా అండగా ఉంటానని ప్రతి పల్లెను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి వారిని రాజకీయంగా అవకాశం కల్పించిన నాయకుడు దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. తండాలు జీపీలుగా కావడంతో తమ తండాల్లో వారే సర్పంచులు, ఎంపీటీసీలు అయితున్నారన్నారు. బీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా కండువా వేసి స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.
ఈకార్యక్రమంలో మాజీ ఆఫ్కో చైర్మన్ మండల శ్రీరాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, ఎంపీపీ మేకల కలింగరాజు, మద్దూరు ఎంపీపీ బద్దిపడిగ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు చినబోయిన రేఖారాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారద, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బూరెడ్డి ప్రమోద్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు వంగాల రేణుక శంకర్, తేజావత్ కల్యాణి వినోద్, బానోత్ స్వరూపా వెంకటేశ్, బానోత్ జయరాం, లక్ష్మీనర్సయ్య, ఎర్ర సుజాత, సానబోయిన శ్రీనివాస్, ముక్క రాజయ్య, మాజీ సర్పంచ్లు దండు సత్యనారాయణ, బనుక భిక్షపతి, సలేంద్ర కొమురయ్య, దేవూలపల్లి రాజేంద్ర ప్రసాద్, వల్లా మల్లేశం, పార్టీ మండల కార్యదర్శులు నిమ్మల స్వామి ఎడ్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సుదాగాని సంజీవ, అజ్మీరా స్వామి నాయక్, ధర్మా జయప్రకాశ్ రెడ్డి, నాయకులు ఏళ్ల సంతోష్రెడ్డి, విరేందర్ రెడ్డి, కొండబోయిన రాజు యాదవ్, రామకృష్ణ, పాషా, పరశురాములు, హనుమంతరావు, ఉప్పలయ్య, ప్రసాద్, డానియల్, కొమ్మురాజు, సిద్దులు, అనిల్, వివిధ గ్రామాల అధ్యక్షులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.