మెదక్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఓటు రాజ్యాంగం మనకిచ్చిన హకు అని, ఓటరుగా నమోదుగా చేసుకోవడం, సక్రమంగా వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒకరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని యువతకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, ఏడాదిలో నాలుగు పర్యాయాలు నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు. ఫారం.6 ద్వారానేగాక గరుడ యాప్, మొబైల్ ద్వారా, ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సులువుగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశాలున్నాయన్నారు. సందేహాలకు 1950 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు. డిసెంబర్ 3, 4 తేదీల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 8 వరకు పేరు నమోదు చేసుకున్న వారికి జనవరి 5, 2023 ప్రకటించే ఓటరు తుది జాబితాలో నమోదవుతుందన్నారు.
బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి అర్హులను గుర్తించి ఓటరుగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఓటరుగా నమోదుకు యువ ఓటర్లున్నారని, ఎల్రక్టోరల్ లిటరసీ క్లబ్లు, పాఠశాల, కళాశాల అంబాసిడర్లు ఓటరు శాతం పెంచడానికి కృషి చేయాలన్నారన్నారు. బీఎల్వోలు ప్రతి పోలింగ్ కేంద్రంలో అర్హులైన యువ, దివ్యాంగ, ట్రాన్స్ జెండర్ ఓటర్లను గుర్తించి నమోదు చేయాలన్నారు. బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఫామ్-6 ద్వారా నూతన ఓటర్ల నమోదు, ఫామ్ 6(బి), ఫామ్-7, ఫామ్-8 ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి ఆదివారం మెదక్ మండలం ర్యాలమడుగులోని 202 పోలింగ్ బూత్ను సందర్శించి ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి నూతన ఓటరుకు ఫారం.6 అందజేశారు.