మిరుదొడ్డి, మే 5 : అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం రేవంతరెడ్డి పథకాలు అమలు చేయకుండా నట్టేట ముంచాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా రోడ్షోకు ఆయన హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ బీడీ కార్మికుల పొట్టగొట్టాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి గెలువగానే రూ.2 వేల పింఛన్ నుంచి రూ.4 వేల ఇస్తానని చెప్పి నేడు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదు, రైతు బంధు లేదు, కంది పప్పు ధరలు పెరిగాయన్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నేడు కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు వచ్చాయన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్రావు ఏమి చేసిండో ప్రజలు గుర్తించాలన్నారు.
మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాడన్నారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ . పేద పిల్లల కోసం ట్రస్టు ఏర్పాటు చేస్తానన్నారు. దుబ్బాకను సిద్దిపేట, గజ్వేల్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. పేద విద్యార్థులకు దుబ్బాకలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి జాబ్మేళా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కల్యాణ మండపాలు నిర్మించి పేద ప్రజల పెండ్లికి అద్దెకు ఇస్తామన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రబాకర్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలించాలన్నారు. దుబ్బాకలో చెల్లని రఘునందన్రావు ఢిల్లీలో ఎలా చెల్లుతాడన్నారు. మాయమాటలు చెప్పే రఘునందన్రావు మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనోహర్రావు, కత్తికార్తీక, సోలిపేట సతీశ్రెడ్డి, మిరుదొడ్డి జడ్పీటీసీ సూకురి లక్ష్మీలింగం, వైస్ ఎంపీపీ పోలీసు రాజులు, ఎంపీటీసీలు సుతారి నర్సింహులు, ధర్మారం లక్ష్మీమల్లయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు బాపురెడ్డి, సత్యనారాయణ, కమలాకర్రెడ్డి, తుమ్మల బాల్రాజు, మల్లేశం, రాజహేందర్రెడ్డి, బైరయ్య, స్వామి, గొల్ల రాములు, కుమార్, పరశురాములు పాల్గొన్నారు.