బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఊరూరా ఘనంగా జరిగాయి. మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రంతోపాటు ఓల్డేజ్ హోమ్లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
తెలంగాణకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకుడని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రామాయంపేటలోని బీఆర్ఎస్ కార్యాల యంలో ఎమ్మెల్యే కేక్ను కట్ చేశారు. సీఎం కేసీఆర్తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందుతుందన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ చలవేనని పేర్కొన్నారు.
మనోహరాబాద్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో జడ్పీచైర్పర్సన్ హేమలతాగౌడ్ పాల్గొని కేక్ కట్ చేశారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతిని ధులు సంబురాలు నిర్వహించారు. దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పలువురు నాయకులు రక్తదానం చేశారు.
– మెదక్ జిల్లా నెట్వర్క్, ఫిబ్రవరి 17