మెదక్,ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆమె రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆయన పంటలు కాపాడేందుకు ఘనపూర్ ఆనకట్టకు 0.30 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.సింగూరు ప్రాజెక్టు నుంచి ఇప్పుటి వరకు 0.90 టీఎంసీల నీటిని మూడు విడతల్లో విడుదల చేశారని, మరో 0.30 టీఎంసీల నీటిని విడుదల చేస్తే వరి పంట దక్కుతుందని పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ఆర్సీ చైర్మన్ కలిసి కోరారు.
మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఘనపూర్ ఆయకట్టు రైతులకు అండగా నిలిచారు. యాసంగిలో ఘనపూర్ ఆయకట్టు నీటి విడుదల విషయం పట్టించుకోలేదు. సిం గూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయలని మెదక్ కలెక్టర్కు కలిసి పద్మాదేవేందర్రెడ్డి వినతి పత్రం అందజే శారు. మంగళవారం హెచ్ఆర్సీ చైర్మన్ను కలిసి విజ్ఞప్తి చేయగా స్పందించిన ఆయన నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.