గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మాదాసు శ్రీనివాస్ నియామకం
నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన పాలకవర్గం, నాయకులు
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు
గజ్వేల్, జూన్ 4 : గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో మాదాసు చురుకైన పాత్ర పోషించాడు. శ్రీనివాస్ సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2020లో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించగా, అతడి భార్య మాదాసు అన్నపూర్ణను నియమించారు. రెండేండ్లపాటు అన్నపూర్ణ మార్కెట్ చైర్మన్గా సేవలను అందించి అందరి మన్ననలు పొందారు. ఏఎంసీ గజ్వేల్ స్థానం బీసీ జనరల్కు కేటాయించడంతో సీఎం కేసీఆర్ శ్రీనివాస్ను చైర్మన్గా నియమించారు. ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి సమస్య ఉన్నా మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయడంతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. శ్రీనివాస్కు ఏఎంసీ చైర్మన్గా అవకాశం కల్పించడంపై పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు రుణపడి ఉంటా
-ఏఎంసీ చైర్మన్ మాదాసు శీనివాస్
తెలంగాణ ఉద్యమం, పార్టీ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తించి తన భార్యకు రెండుసార్లు ఏఎంసీ చైర్మన్గా అవకాశం ఇవ్వడంతో పాటు ఈసారి తనను గజ్వేల్ చైర్మన్గా నియమించడంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదా సు శ్రీనివాస్తోపాటు పాలకవర్గం, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి శనివారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఉద్యమకాలం నుంచి తనపై ఎంతో విశ్వాసం ఉంచారన్నారు. వారి సన్నిహితుడిగా గుర్తించి తనకు కీలకమైన పనులు అప్పగించారని తెలిపారు. సామాన్య కార్యకర్త అయిన తనకు ఏఎంసీ చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు జన్మంతా రుణపడి ఉంటానన్నారు. ఈ అవకాశం రావడానికి సహకరించిన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
గజ్వేల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం
గజ్వేల్ నూతన పాలకవర్గంలో చైర్మన్గా మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్గా ఉపేందర్రెడ్డి, డైరెక్టర్లుగా దౌలపురం భాస్కర్రెడ్డి, చల్ల బాలకిషన్, మాసపాక యాదగిరి, శీలసారం ప్రవీణ్, అత్తెల్లి రవి, కొంటెమైన నర్సింహులు, సయ్యద్ మతిన్, పత్తి బాబు, స్వామి, ఎల్ల య్య, లలిత, నర్సింహులు, నేతి చిన్న శ్రీనివాస్ నియామకమయ్యారు. వీరితోపాటు పీఏసీఎస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు.
ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్కు సన్మానం
గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్తోపాటు, వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్రెడ్డిని శనివారం ఇటిక్యాల, మునిగడప సర్పంచ్లు చంద్రశేఖర్, బాల్లక్ష్మయ్య పూల బొకే అందించి శాలువాతో సన్మానించారు. ఏఎంసీ డైరెక్టర్లుగా రెండోసారి ఎన్నికైన మాసపాక యాదగిరి, బాలకిషన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుకు ప్రజాప్రతినిధులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం తన నివాసంలో మలుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, తీగుల్ మాజీ సర్పంచ్ సుధాకర్రెడ్డి, జగదేవ్పూర్ మాజీ సర్పంచ్ యువ నాయకుడు కొంపల్లి కరుణాకర్ కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.