ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో అందోల్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని, ఇది ఓర్వలేని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పసలేని ఆరోపణలు చేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం మండలంలోని ఖమ్మంపల్లి-పోల్కంపల్లి శివారులోని శ్రీసాయి గార్డెన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రోడ్లు వేస్తుంటే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పనులు ఆపాలని బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒకవైపు రూ. వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతుంటే మరోవైపు రాజనర్సింహ తన అనుచరులతో కోర్టుల్లో కేసులు వేయించడం నిజం కాదా అని ప్రశ్నించారు. అందోల్లో ఎక్కడ, ఏం అభివృద్ధి జరిగిందో నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఎక్కడ జరగలేదో నువ్వు చూపించగలవా అంటూ సవాల్ విసిరారు.
– మునిపల్లి, సెప్టెంబర్ 11
మునిపల్లి, సెప్టెంబర్ 11: అభివృద్ధికి నోచుకోని పల్లెలు తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పథంలోనే దూసుకుపోతున్నాయని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం మునిపల్లిలో మనఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలో వంటగది, డైనింగ్ హాల్, స్థానికంగా డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద సీసీ రోడ్డు, చౌరస్తా నుంచి బుసారెడ్డిపల్లి వరకు నిర్మించిన బీటీరోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి ఆమాడదూరంలో ఉన్న పల్లెలు సీఎం కేసీఆర్ చొరవతో అభివృద్ధిలో పోటీపడుతున్నాయన్నారు. మునిపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రహించి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయిన, వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు తగిన విద్య లభిస్తున్నదని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. సీఎం ప్రత్యేక కృషితో కార్పొరేట్తో పోటీపడేలా సర్కారు బడులు కొనసాగుతున్నాయన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఇంటింటికీ తిరిగి విద్యార్థులను బడుల్లో చేర్పించండి అని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అడిగేవారని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు కావాలని తల్లిదండ్రులు బతిమిలాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన మునిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మధురిమకు ఘనంగా సన్మానించారు.
కేసీఆర్ కృషితోనే సొంతింటి కల నెరవేరింది
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరువతోనే సొంతింటి కల నెరవేరిందని ఎమ్మెల్యే తెలిపారు. మునిపల్లిలోని డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించి, లబ్ధిదారులను కలిసి మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజా శివశంకర్, జడ్పీటీసీ మీనాక్షీ సాయికుమార్, రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, సర్పంచ్లు రమేశ్, స్వప్నాశశికుమార్, విశ్వనాథంపాటిల్, శ్రీనివాస్, యువత విభాగం అధ్యక్షుడు ఆనంద్రావు, మైనార్టీ మండల అధ్యక్షుడు మౌలనా పాల్గొన్నారు.
మునిపల్లి, సెప్టెంబర్ 11: గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని అందోల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నది నువ్వు కాదా.. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సంబంధిత అధికారులను ఫోన్లు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నది నువ్వు కాదా అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మండిపడ్డారు. సోమవారం మండలంలోని ఖమ్మంపల్లి- పోల్కంపల్లి గ్రామ శివారులో శ్రీసాయి గార్డెన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు అందోల్ నియోజవర్గానికి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శనిలా మారారన్నారు. రాజనర్సింహ మతిస్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడన్నారు. నియోజకవర్గంలో కోట్లు వెచ్చించి, అభివృద్ధి చేస్తుంటే కోర్టుల చుట్టూ తిరిగి దామోదర అనుచరులతో కేసులు వేయిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
చర్చకు సిద్దమా.. దామోదర
అందోల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అభివృద్ధి ఎక్కడ జరుగలేదో నిరూపించడానికి నువ్వు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సవాల్ విసిరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గానికి ఏమీ చేయలేదు, ఇన్నిరోజులు ఎక్కడున్నవ్.. ఇప్పుడు నన్ను గెలిపించండి అంటూ ప్రజలను అడగడానికి సిగ్గుండాలి, ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారా.. లేకపోతే రారా.. నీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నారు.
నీ బామ్మరిదే వెయ్యలా రోడ్లన్నీ..
నియోజకవర్గంలో నీ బామ్మరిదే వెయ్యలా రోడ్లన్నీ.. ఇంకెన్ని రోజులు నియోజకవర్గాన్ని దోచుకుంటారు అని ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. నిమోజకవర్గంలో రోడ్లు అభివృద్ధి చేస్తుంటే, అధికారులకు బెదిరిస్తున్నాడని తెలిపారు. నీ పాలనలో గ్రామాలు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉన్నాయో తిరిగి చూస్తే తెలుస్తుందన్నారు. గతంలో ఊరి నుంచి వలసపోయినోళ్లు నేడు సొంత ఊరికి వస్తే ఇది మా ఊరేనా అని ఆశ్చర్యపోయేలా అభివృద్ధి జరుగుతున్నదన్నారు. మునిపల్లి మండలం రూ.13 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చెందుతున్నదన్నారు. మండలంలోని ప్రతి గ్రామానికి సుమారు రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాయికుమార్, మైనార్టీ అధ్యక్షుడు నవీన్వర్మ, నాయకులు తదితరులు ఉన్నారు.
రూ.3 వేల అద్దె తప్పింది
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూం ఇల్లు ఇయ్యకముందు నెలకు రూ.3వేలు ఇచ్చి అద్దెకు ఉండేవాళ్లం.. కేసీఆర్ సార్ మునిపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి డ్రా తీయగా అందులో నా పేరు వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. ప్రస్తుతం కేసీఆర్ సార్ పుణ్యమా అని నాకు సొంతిళ్లు కల నేరవేరింది.కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– సంపూర్ణ, లబ్ధిదారు, మునిపల్లి