కొండాపూర్, డిసెంబర్ 2 : పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కొండాపూర్ మండలంలోని తమ్మలిబాయి తండా, తేర్పోల్, చర్ల గోపూలారం, మల్లెపల్లి, గొల్లపల్లి, మునిదేవునిపల్లి గ్రామాల్లో ఒకొక్క గ్రామానికి రూ. 20 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్డీఎఫ్ నిధుల ద్వారా సీసీ రోడ్ల పనులను ప్రారంభించామన్నారు. మల్లెపల్లి, చర్ల గోపులారం గ్రామాలకు మధ్యలో ఉన్న తెగిన చెరువు కట్ట నిర్మాణానికి రూ.45 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని, ఆ చెరువు మినీ బ్రిడ్జి నిర్మాణానికి కూడా రూ. 2.20 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావులకు కొండాపూర్ మండల ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తేర్పోల్ ప్రభుత్వ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి జడ్పీటీసీ నిధుల కింద రూ. 15 లక్షలతో పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఎస్డీఎఫ్ నిధుల కింద కేవలం కొండాపూర్ మండలానికి రూ.4.80 కోట్లు మంజూరయ్యాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రోడ్డును కూడా ఏర్పాటు చేయలేరన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల సంక్షేమానికి ప్రత్యేకంగా రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ఎంతగానో ఉపయోగపడేలా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనోజ్రెడ్డి, జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్మొద్దీన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, సొసైటీ చైర్మన్లు శ్రీకాంత్రెడ్డి, రాజు, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మ్యాకం విఠల్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మల్లేశం, డిప్యూటీ ఈఈ తులసీరాం, ఏఈ కృష్ణ, సర్పంచ్లు షఫీ, శివలీలా జగదీశ్వర్, అండాలు, శాంతి, ప్రకాశం, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, మాజీ సర్పంచ్లు సత్యనందం, రామాగౌడ్,గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, మల్లాగౌడ్, జగదీశ్వర్, నగేశ్, ప్రభాకర్, మోహన్గౌడ్, ఎంపీటీసీలు రాందాస్, నా యకులు రఘనాథ్రెడ్డి, ప్రభుదాస్, కుమార్, శ్యాంరావు, రవి, రాము, గురుకిరణ్, నషీర్ తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కమ్యూనిటీ భవనాలకు శుక్రవారం టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతాప్రభాకర్ శంకుస్థాపక చేశారు. ఈ సందర్భంగా మల్లెపల్లిలో చంటి రత్నమ్మ, సమ్మని మాణెమ్మ ఇద్దరు వృద్ధ మహిళల దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి పింఛన్లు తీసుకుంటున్నారా.. అమ్మలు అని ఆప్యాయంగా పలకరించారు.
చింతాప్రభాకర్ : మీకు పింఛన్లు ఎవరు ఇస్తున్నారూ..
రత్నమ్మ : ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పంపిస్తుండ్రు అంటూ బదులు ఇచ్చింది. కేసీఆర్కు చేతులేత్తి రోజు మొక్కాలి బిడ్డ.
చింతాప్రభాకర్ : పింఛన్ డబ్బులు మీ మనవళ్లు, మనవరాళ్లకు చాక్లెట్లు, బిస్కట్లకు ఇస్తున్నావా..
రత్నమ్మ : నెలనెలా ముఖ్యమంత్రి పంపిస్తున్న పింఛన్ల నుంచి కొన్ని డబ్బులు పిల్లలకు ఇస్తున్న వారు సంతోషంగా ఉన్నారు.
చింతాప్రభాకర్ : నీ కుటుంబ సభ్యుల మర్యాద ఎలా ఉంది..
రత్నమ్మ : బాగానే చుస్తున్నరు బిడ్డ.. నీ కడుపు సల్లగుండ ఎంత మంచిగా పలకరిస్తున్నావ్ నాయనా.. నీవు పదికాలాలు సల్లంగా ఉండలే..
చింత ప్రభాకర్ : మనకు ముఖ్యమంత్రి ఎవరు కావాలే అమ్మలు..
రత్నమ్మ, మాణెమ్మ : గినేనే ఉండలే కొడుకా..మాలాంటి పేదలకు మంచిగా చేస్తుండ్రు. ప్రతియేటా రైతులకు పైసలు పంపిస్తుండు. పింఛన్లు తప్పకుండా ఇస్తుండు బిడ్డ కేసీఆర్ సారే ఉండాలి నాయనా.. మీరు ఎవరు కొడుకా నేను మాజీ ఎమ్మెల్యేను చింతాప్రభాకర్ను అమ్మలు…సల్లంగ ఉండు బిడ్డా అని దీవెనలు అందించారు.