మెదక్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సీఎం సహాయనిధి పేదలకు వరమని, ఆపద సమయాల్లో భరోసాగా నిలుస్తు న్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్లోని క్యాంప్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 58 లబ్ధిదారులకు రూ.30,20,500 విలువైన చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదప్రజలను సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటున్నట్లు తెలిపారు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ రెండేండ్ల తర్వాత వచ్చేదని గుర్తుచేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ సాప సాయిలు, నాయకులు రాగి అశోక్, శ్రీధర్ యాదవ్, బొద్దుల ప్రవీణ్ గౌడ్, కృష్ణ, మధు, బాలయ్య, వెంకట్రావు, శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పేదల కష్టాలను తీర్చే సీఎంఆర్ఎఫ్ : సునీతాలక్ష్మారెడ్డి
నర్సాపూర్, సెప్టెంబర్ 2 : పేదవారి కష్టాలను తీర్చడానికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్లో పట్టణానికి చెందిన నర్సింహులుకు రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధితుడి కుటుంబ సభ్యులకు తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ భరోసాతోనే పేదప్రజలు కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన చికిత్స పొందుతున్నారని తెలి పారు. కార్యక్రమంలో సర్పంచ్లు సేనాధిపతి, సురేశ్గౌడ్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, తొంట వెం కట్, సుధాకర్రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్.. పేదలకు కల్పతరువు : ఇఫ్కో డైరెక్టర్
రామాయంపేట, సెప్టెంబర్ 2 : దవాఖానలో చికిత్స పొం దుతున్న బాధితులకు సీఎం కేసీఆర్ కల్పతరువుగా మారారని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. రామాయంపేట 5వ వార్డు కు చెందిన బత్తుల విఘ్నేశ్వర్ అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నా డు. విషయాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దృష్టికి స్థానిక కౌన్సిలర్ చంద్రపు శోభ తెచ్చారు. ఈ మేరకు వైద్యచికిత్సకు సీఎంఆర్ఎఫ్లో రూ.3.50 లక్షలు మంజూరు చేయించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే స్వగృహంలో బాధితుడి కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్ గజవాడ నాగరాజు, చంద్రపు కొండల్రెడ్డి ఉన్నారు.