నిజాంపేట,ఫిబ్రవరి7: పాడి రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పశువులకు వచ్చే వివిధ రకాల వ్యాధులకు నివారణ టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. పాడిరైతులు వ్యవసాయరంగానికి అనుబంధంగా పశువులను పోషించుకుంటూ వాటి ఎరువుతో సేంద్రియ వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. పశుసంపద గ్రామాల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న క్రమంలో ఈ మధ్య 4 నుంచి 8 నెలల వయస్సున్న ఆడ దూడల్లో బ్రూసెల్లోసిస్ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నది. ఈ వ్యాధి పశువులతో పాటు మనుషులకూ వ్యాపిస్తున్నది. దీని వల్ల పశువుల్లో గర్భస్రావం సమస్య ఏర్పడుతున్నది. వీటి నివారణకు స్థానికంగా ఉన్న పశువైద్యశాలలకు ఆడ దూడలకు తీసుకొచ్చి టీకాలను వేయించుకోవాలని పశువైద్యులు సూచిస్తున్నారు.
బ్రూసెల్లోసిస్ వ్యాధి లక్షణాలు
తీసుకోవల్సిన జాగ్రత్తలు
పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి
పశువుల్లో బ్రూసెల్లోసిస్ వ్యాధి వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమం చేపట్టింది. పాడిరైతులకు ఈ వ్యాధి పట్ల పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం. ఆడ దూడలకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేసి వాటి చెవులకు ట్యాగ్ వేస్తున్నాము. ఈ టీకాను పశువులకు ఒక్క సారి వేస్తే చాలు జీవితకాలం మళ్లీ వ్యాధి రాదు. పాడి రైతులు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-సుధాకర్ దేశ్ముఖ్, వెటర్నరీ డాక్టర్, నిజాంపేట
డాక్టర్ల సూచనలు పాటిస్తున్నా..
మా గ్రామంలో పశుసంపద పెంచేందుకు సుమారు రూ.5 లక్షల పెట్టుబడి పెట్టి మేడ్చల్, సిద్దిపేట, తూప్రాన్ పట్టణాల నుంచి 39 ఆడ దూడలను కొనుగోలు చేశాను. 4 నుంచి 8 నెలల వయసున్న ఆడ దూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధి వస్తున్నదని మా ఊరు పశువుల డాక్టర్ సుధాకర్తో చెప్పడంతో దూడలకు టీకాలు వేయించిన. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాయి. పశువులకు ఏ వ్యాధి వచ్చినా పశువుల డాక్టర్కు చూపించి వారి సూచనలు పాటిస్తున్నా.
-బక్కొల్ల బాగులు,పాడిరైతు,నిజాంపేట